Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ముషారఫ్‌పై దర్యాప్తును ఆలస్యం చేస్తున్న పాక్

Advertiesment
స్పష్టమైన ఆదేశాలు
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌కు సంబంధించిన కేసుపై దర్యాప్తును పాకిస్థాన్ పోలీసులు ఆలస్యం చేస్తున్నారు. పాక్ ప్రభుత్వం నుంచి ఈ కేసు దర్యాప్తు విషయంలో ఎటువంటి స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో పోలీసులు అలసత్వం ప్రదర్శిస్తున్నట్లు ఆ దేశ మీడియా పేర్కొంది.

2007లో దేశంలో అత్యాయిక పరిస్థితి (ఎమర్జెన్సీ) విధించిన సందర్భంగా న్యాయమూర్తులను అక్రమంగా నిర్బంధించినట్లు ముషారఫ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పాక్ ప్రభుత్వం నుంచి గట్టి ఆదేశాలేవీ అందకపోవడంతో దీనికి సంబంధించిన కేసు దర్యాప్తులో పాక్ పోలీసులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

ఓ స్థానిక కోర్టు ఆదేశాలపై ఇస్లామాబాద్‌లోని ఓ పోలీసు స్టేషన్‌లో గత వారం ముషారఫ్‌పై కేసు నమోదయింది. ముషారఫ్ ప్రస్తుతం లండన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ముషారఫ్ తిరిగి స్వదేశానికి వస్తే ఈ కేసులో అరెస్టు చేసే అవకాశం ఉంది.

Share this Story:

Follow Webdunia telugu