Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ముంబాయి దాడులతో ఇండో-పాక్ చర్చలు ఆగరాదు: గిలానీ

Advertiesment
గిలానీ
, శనివారం, 27 ఆగస్టు 2011 (10:37 IST)
2008లో ముంబాయిపై జరిగిన తీవ్రవాదుల దాడితో భారత్, పాకిస్థాన్‌ల మధ్య చర్చలు ఆగిపోరాదని పాకిస్థాన్ ప్రధానమంత్రి యూసఫ్ రజా గిలానీ అభిప్రాయపడ్డారు. రాబర్ట్ పీ కాసే నేతృత్వంలోని అమెరికా సెనేట్ ప్రతినిధుల బృందం ఇస్లామాబాద్‌లో భేటీ అయిన సందర్భంలో గిలానీ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇటీవల విజయవంతమైన పాకిస్థాన్ విదేశాంగమంత్రి హీనా రబ్బానీ ఖర్ భారత పర్యటనతో పాటు అంతకుముందు వాణిజ్య, హోం కార్యదర్శుల మధ్య జరిగిన ఉన్నత స్థాయి చర్చలను కూడా గిలానీ ప్రస్తావించారు. పాకిస్థాన్ సమస్యలో భాగం కాదని పరిష్కారంలో మాత్రమే భాగమని గిలానీ పేర్కొన్నట్లు పాక్ ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. కాగా పాకిస్థాన్, అమెరికా బలగాల మృతికి కారణమవుతున్న అభివృద్ధి చేసిన పేలుడు పరికరాలపై అమెరికా సెనేటర్లు ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu