Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మయన్మార్: సూకీకి 18 నెలల గృహ నిర్బంధం

Advertiesment
మయన్మార్ కోర్టు
గృహ నిర్బంధ నియమాలను ఉల్లంఘించిన కేసులో మయన్మార్ కోర్టు మంగళవారం దేశ ప్రజాస్వామ్య నేత అంగ్ సాన్ సూకీని దోషిగా పరిగణించింది. గృహ నిర్బంధాన్ని ఉల్లంఘించిన కేసులో మయన్మార్ కోర్టు సూకీని దోషిగా పరిగణిస్తూ ఈ రోజు తుది తీర్పు చెప్పింది. మయన్మార్ మిలిటరీ జుంతా ఆదేశాల మేరకు ఆమెకు ఈ కేసులో 18 నెలల గృహ నిర్బంధాన్ని ఖరారు చేశారు.

అమెరికా మిలిటరీ మాజీ అధికారి ఒకరు గృహ నిర్బంధంలో ఉన్న సూకీని ఎటువంటి అనుమతులు లేకుండా కలుసుకోవడం వివాదాస్పదమైంది. భారీ భద్రత ఉండే సూకీ నివాసంలోకి అమెరికా మాజీ మిలిటరీ అధికారి ప్రవేశించడాన్ని భద్రతా యంత్రాంగం గుర్తించింది. ఈ మాజీ అధికారికి ఆతిథ్యం ఇవ్వడం ద్వారా గృహ నిర్బంధ నియమాలను సూకీ ఉల్లంఘించారని మయన్మార్ అధికారిక యంత్రాంగం ఆమెపై కేసు పెట్టింది.

ఈ కేసులో మయన్మార్ కోర్టు సూకీకి మంగళవారం మూడేళ్లు గృహ నిర్బంధాన్ని విధించింది. అయితే దీనిని మయన్మార్ మిలిటరీ పాలకులు సగానికి తగ్గించి, 18 నెలల గృహ నిర్బంధాన్ని ప్రకటించారు. గత 20 ఏళ్ల కాలంలో 14 ఏళ్లపాటు సూకీ నిర్బంధంలోనే గడిపారు.

ఎక్కువ కాలం గృహ నిర్బంధంలో ఉన్నారు. మయన్మార్‌లో సూకీతోపాటు సుమారు 2000 వేల మంది పౌరులు రాజకీయ ఖైదీలుగా జీవితం గడుపుతున్నారు. వీరిని విడుదల చేయాలని అంతర్జాతీయ సమాజం అనేకసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ, మయన్మార్ మిలిటరీ పాలకులు మాత్రం ఈ విజ్ఞప్తులను పట్టించుకోవడం లేదు.

Share this Story:

Follow Webdunia telugu