భారత్తో ప్రతిపాదిత ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందం సిద్ధమయ్యేందుకు కొంత సమయం పడుతుందని అమెరికా యంత్రాంగం బుధవారం వెల్లడించింది. ఈ ఒప్పందం నిర్మాణాత్మక రూపు సంతరించుకోవడానికి సమయం పడుతుందని అమెరికా వాణిజ్య శాఖ ప్రతినిధి దెమెత్రియోస్ మారెంటిస్ విలేకరులతో చెప్పారు.
ఇరుదేశాల పెట్టుబడిదారులకు భద్రత కల్పించేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడుతుంది. భారత్ పెట్టుబడిదారులకు అమెరికా మార్కెట్లలో, అమెరికా పెట్టుబడిదారులకు భారత మార్కెట్లలో భద్రత కల్పించేందుకు ఉద్దేశించిన ఈ ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందాన్ని సిద్ధం చేసేందుకు ఇప్పటికే ఇరుదేశాల మధ్య తొలి దశ చర్చలు జరిగాయి.
ఇది పూర్తిగా సిద్ధమయ్యేందుకు సమయం పడుతుందని అమెరికా అధికారి తెలిపారు. జూన్లో అమెరికాలో పర్యటించిన భారత వాణిజ్య శాఖ మంత్రి ఆనంద్ శర్మ ఈ ద్వైపాక్షిక ఒప్పందం కోసం చర్యలు ప్రారంభించారు.