Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫజ్లుల్లాను నేరస్తుడిగా ప్రకటించిన పాక్ కోర్టు

Advertiesment
పాకిస్థాన్
పాకిస్థాన్‌లోని సమస్యాత్మక స్వాత్ లోయలో ఉన్న తీవ్రవాద నిరోధక కోర్టు ఒకటి స్థానిక తాలిబాన్ చీఫ్ మౌలానా ఫజ్లుల్లాను పరారీలో ఉన్న నేరస్తుడిగా ప్రకటించింది. ఫజ్లుల్లాతోపాటు, మరో ఆరుగురు అతని అనుచరులను కూడా పరారీలో ఉన్న నేరస్తులుగా ప్రకటిస్తూ న్యాయమూర్తి ఖలీల్ ఖాన్ ఖలీల్ ఆదేశాలు జారీ చేశారు.

ఫజ్లుల్లా, అతని అనుచరులు ఏడు రోజుల్లోగా స్థానిక పోలీస్ స్టేషన్‌లో లేదా కోర్టులో హాజరుకావాలని ఆదేశించింది. గడువులోగా వీరు ఈ ఆదేశాలను పాటించని పక్షంలో తదుపరి చర్యలు తీసుకుంటామని కోర్టు హెచ్చరించింది. ఫజ్లుల్లా 100కుపైగా కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. వీటిలో హత్య, హత్యాయత్నం కేసులు కూడా అనేకం ఉన్నాయి. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు.

Share this Story:

Follow Webdunia telugu