పెరూ దేశానికి చెందిన మాజీ అధ్యక్షుడు అల్బర్టో ఫుజీమోరీ లంచం ఇచ్చాడనే ఆరోపణలు రుజువు కావడంతో ఆ దేశ సుప్రీం కోర్టు ఆరు సంవత్సరాల జైలు శిక్షను విధించింది.
మాజీ అధ్యక్షుడు అల్బర్టో ఫుజీమోరీ తన పదవీ కాలంలో (1990 నుంచి 2000) తన ప్రత్యర్థుల టెలిఫోన్ ట్యాప్ చేయించేందుకు, పార్లమెంట్ సభ్యులు, పత్రికా ప్రకాశకులకు లంచాలు ఇచ్చారనే ఆరోపణలు ఋజువు కావడంతో ఆయనకు ఉన్నత న్యాయస్థానం ఆరు సంవత్సరాల జైలుశిక్ష విధించింది.
అలాగే గృహ యుద్ధం సందర్భంగా వామపక్షాలు, మావోయిస్టులైన షాయినింగ్ గ్రూపుకు చెందిన అసంఖ్య విద్రోహులను హతమార్చినందులకు, దేశంలో ఆర్థికరంగాన్ని నష్టాల్లో కూరుకుపోయేలా తీసుకున్న చర్యలు తదితర ఆరోపణలున్నాయి.
ఇదిలావుండగా తన పదవీకాలంలో 2000వ సంవత్సరంలో ఆయన ఓ పార్లమెంట్ సభ్యునికి లంచం ఇవ్వజూపిన వీడియోటేప్ చిత్రం ప్రజలలోకి వచ్చిన తర్వాత ఆయన పదవిని త్యజించాల్సి వచ్చింది.
కాగా పదవిని త్యాగం చేసిన తర్వాత ఆయన తన తల్లిదండ్రుల స్వదేశమైన జపాన్ వెళ్ళిపోయారు. 2005లో జపాన్ నుంచి తిరిగి వచ్చిన నేపథ్యంలో చిలీలో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించే నిమిత్తం పెరూ తరలించారు.