Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పాక్ తాలిబాన్ కొత్త చీఫ్ ఫఖీర్ ముహమ్మద్

Advertiesment
మిలిటెండ్ కమాండర్
ఫఖీర్ ముహమ్మద్ తాలిబాన్ నేత తెహ్రీక్ ఎ తాలిబాన్ పాకిస్థాన్ తీవ్రవాద గ్రూపుకు తననితాను కొత్త చీఫ్‌గా ప్రకటించుకున్నాడు. ఇప్పటివరకు మిలిటెంట్ కామండర్‌గా వ్యవహరిస్తున్న మౌల్వీ ఫఖీర్ ముహమ్మద్ మాట్లాడుతూ.. బైతుల్లా మెహసూద్ స్థానంలో తాను తాత్కాలికంగా తెహ్రీక్ ఎ తాలిబాన్ పాకిస్థాన్ గ్రూపు సారథ్య బాధ్యతలు చేపట్టినట్లు వెల్లడించాడు.

డ్రోన్ దాడిలో బైతుల్లా మెహసూద్ ఇటీవల మరణించినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. బైతుల్లా మెహసూద్ మరణించాడని అమెరికా, పాకిస్థాన్ అధికారిక యంత్రాంగాలు బలంగా విశ్వసిస్తున్న సంగతి తెలిసిందే. డ్రోన్ దాడిలో బైతుల్లా మెహసూద్ మరణించలేదని, తీవ్రంగా జబ్బునపడ్డాడని తాజాగా మౌల్వీ వెల్లడించాడు.

తాజాగా మౌల్వీ ఫఖీర్ ముహమ్మద్ జర్నలిస్ట్‌లతో ఫోన్‌లో మాట్లాడుతూ.. తాలిబాన్ గ్రూపుకు తనని తాను అధిపతిగా ప్రకటించుకున్నాడు. ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లోని బజౌర్ గిరిజన ప్రాంతాల్లో తాలిబాన్ పోరాటయోధులకు మౌల్వీ ఫఖీర్ కమాండర్‌గా వ్యవహరిస్తున్నాడు.

మెహసూద్ మరణంపై మీడియాలో వచ్చిన వార్తలు అవాస్తమని, అతను జబ్బునపడ్డాడని, అందువలనే తాము అజ్ఞాతంలోకి వెళ్లామని మౌల్వీ చెప్పాడు. ఈ కారణంగా తాలిబాన్ గ్రూపు సారథ్య బాధ్యతలను తాత్కాలికంగా తాను స్వీకరిస్తున్నట్లు తెలిపాడు. బైతుల్లా మెహసూద్ మరణించినా, తమ ఉద్యమంపై ప్రభావం ఉండదని పేర్కొన్నాడు.

Share this Story:

Follow Webdunia telugu