Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పాకిస్థాన్‌లో డ్రోన్ దాడులు: 12మంది మృతి

Advertiesment
పాకిస్థాన్
పాకిస్థాన్‌లో డ్రోన్ విమానం జరిపిన దాడులలో దాదాపు 12 మంది మృతి చెందారు.

పాకిస్థాన్‌లో అమెరికాకు చెందిన డ్రోన్ (మానవ రహిత) విమానం దాడులకు పాల్పడింది. ఇది ఆఫ్గనిస్థాన్ సరిహద్దుల్లోనున్న ఉత్తర వజీరిస్థాన్ ప్రాంతంలో ఒసామా బిన్ లాడెన్ తల దాచుకున్న ప్రాంతంలో రెండు మిస్సైళ్ళు పడ్డాయి. దీంతో అక్కడున్న 12 మంది మృతి చెందారు.

ఆఫ్గనిస్థాన్ సరిహద్దుల్లోనున్న ఉత్తర వజీరిస్థాన్ ప్రాంతంలో లాడెన్ తలదాచుకున్నాడన్న అనుమానంతో అక్కడ అమెరికాకు చెందిన డ్రోన్ విమానం దాడులకు పాల్పడింది. ఈ వారంలో అమెరికా ఇలా దాడులకు పాల్పడడం మూడవసారి.

డ్రోన్ విమానం నుంచి మిస్సైళ్ళు నేలపై పడటంతో ఒళ్ళు గగుర్పొడిచే భయంకరమైన విస్ఫోటనం జరిగింది. దీంతో తమ తలుపులు పడిపోయాయని, ఇక్కడ జరిగిన విస్ఫోటనం తర్వాత ఆకాశంలో డ్రోన్ విమానం ఎగురుతూ కనపడిందని స్థానికులు తెలిపారు.

ఓ ఇంటిపై జరిగిన ఈ దాడులలో అందులోనున్న 12 మంది మృతి చెందినట్లు భద్రతా దళాలు వెల్లడించాయి. మృతి చెందిన వారిలో ఎక్కువమంది ఆఫ్గనిస్థానీయులున్నారని వారు పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu