Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నేపాల్ ప్రధానిని కలిసిన భారతదౌత్యవేత్త

Advertiesment
భారతదేశం
భారతదేశానికి చెందిన నేపాల్ దౌత్యవేత్త రాకేష్ సూద్ శనివారంనాడు నేపాల్ ప్రధానిని కలిశారు.

నేపాల్ ప్రధాన మంత్రి మాధవ్ కుమార్ నేపాల్‌ను భారతదేశానికి చెందిన నేపాల్ దౌత్యవేత్త రాకేష్ సూద్ శనివారం ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా ఆయన నేపాల్ ప్రధానిని వచ్చే వారం భారత్ పర్యటించాలని ఆహ్వానించారు.

దౌత్యాధికారి నేపాల్ ప్రధానిని కలిసిన అనంతరం ఆ దేశ ప్రధాని పర్యటన ఖరారైనట్లు అధికారులు వెల్లడించారు.

తమ ప్రధాని ఆగస్టు నెల 18న భారతదేశ పర్యటన ఉంటుందని వారు తెలిపారు. ఈ సందర్భంగా భారతదేశంలోని ప్రముఖ నాయకులు తదితర ప్రముఖులతో సమావేశమౌతారని అధికార వర్గాలు తెలిపాయి.

ఈ సందర్భంగా నేపాల్ ప్రధాని దౌత్యాధికారి రాకేష్ సూద్‌కు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు అందజేసినట్లు అధికారులు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu