ఒకనాటి సోదర దేశాలుగా ఉండి ప్రస్తుతం బద్ధ శత్రువులుగా వ్యవహిస్తున్న ఉత్తర, దక్షిణ కొరియా దేశాల మధ్య ఉన్నతస్థాయి చర్చలు శనివారం జరుగనున్నాయి. సుమారు రెండు సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత ఈ చర్చలు మళ్లీ జరుగనున్నాయి. దీంతో ఇరు దేశాల చర్చలపై ప్రపంచ దేశాలన్నీ ఆసక్తిగా చూస్తున్నాయి.
ఈ చర్చల్లో ఇరు దేశాల మంత్రులతో పాటు.. ఉన్నాతాధికారులు కూడా పాల్గొననున్నారు. ఈ చర్చల అనంతరం ఇరు దేశాల మధ్య సత్ సంబంధాలు నెలకొంటాయని భావిస్తున్నట్టు దక్షిణ కొరియా మంత్రి కిమ్ హ్యూయూన్ ధీమా వ్యక్తం చేశారు. గత కొంత కాలంగా ఈ రెండు దేశాల మధ్య శత్రుత్వం హెచ్చుమీరుతున్న విషయం తెల్సిందే.