Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నామ్‌లో కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన పాక్

Advertiesment
పాకిస్థాన్
కాశ్మీర్ వివాదాన్ని తెరపైకి తెచ్చేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం ఈజిప్టులో జరుగుతున్న అలీనోద్యమ దేశాల (నామ్) సదస్సును వేదికగా చేసుకుంది. దక్షిణాసియా ప్రాంతంలో శాంతి స్థాపనకు కాశ్మీర్ వివాదానికి పరిష్కారం ముఖ్యమని పాకిస్థాన్ ప్రభుత్వం వ్యాఖ్యానించింది. భారత్‌తో ఈ వివాదం పరిష్కారం దిశగా ముందడుగు కూడా పడిందని పేర్కొంది.

దక్షిణాసియా ప్రాంతంలో శాశ్విత శాంతి స్థాపన సాధ్యమేనని పాకిస్థాన్ ప్రధానమంత్రి యూసఫ్ రజా గిలానీ పేర్కొన్నారు. జమ్ము- కాశ్మీర్‌తోసహా ఈ ప్రాంతంలో నెలకొనివున్న సుదీర్ఘ వివాదాలను పరిష్కరించడం ద్వారా శాంతి స్థాపన సాధ్యపడుతుందని గిలానీ అభిప్రాయపడ్డారు.

భారత్- పాక్ సంబంధాలను ఇటీవల కొంత ముందుకు తీసుకెళ్లడం జరిగిందన్నారు. సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లడంపై ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో నివసిస్తున్న 1.5 బిలియన్ల మంది ప్రజలకు శాంతిని అందించడం, వారికి ఎంతో విలువైన కానుక అవుతుందన్నారు.

Share this Story:

Follow Webdunia telugu