కొత్తగా ఎల్టీటీఈ సారథ్య పగ్గాలు చేపట్టిన సెల్వరాసా పధ్మనాథన్ను థాయ్లాండ్ పోలీసులు అరెస్టు చేశారని శ్రీలంక ప్రభుత్వ ఛానల్ ఒకటి గురువారం వెల్లడించింది. శ్రీలంకలో ఇటీవల ముగిసిన అంతర్యుద్ధంలో పూర్తిగా నాశనమైన ఎల్టీటీఈ తీవ్రవాద సంస్థ సారథ్య బాధ్యతలు సెల్వరాస ఇటీవల స్వీకరించిన సంగతి తెలిసిందే.
తమ లక్ష్యం కోసం ఇకపై సెల్వరాస పధ్మానథన్ నేతృత్వంలో పోరాడతామని ఇటీవల ఎల్టీటీఈ ప్రకటించింది. ఇదిలా ఉంటే ఎల్టీటీఈ కొత్త అధిపతిని థాయ్లాండ్ పోలీసులు అరెస్టు చేశారని శ్రీలంక మీడియా వెల్లడించింది. కేపీగా బాగా తెలిసిన సెల్వరాస పధ్మనాథన్ను బ్యాంకాక్లో అరెస్టు చేసినట్లు రుపావాహిని ఛానల్ పేర్కొంది.
తాజా పరిణామానికి సంబంధించి ఆ ఛానల్ ఇతర వివరాలేవీ వెల్లడించలేదు. సెల్వరాస పధ్మనాథన్, అతనితో అరెస్ట్ అయిన మరో వ్యక్తి ప్రస్తుతం శ్రీలంక అధికారిక యంత్రాంగం కస్టడీలో ఉన్నారని తెలిపింది. ఎల్టీటీఈ చీఫ్ వేలుపిళ్లై ప్రభాకరన్ కొన్ని నెలల క్రితం ఈ తీవ్రవాద అంతర్జాతీయ విభాగాధిపతిగా పధ్మనాథన్ను నియమించారు.
అనంతరం శ్రీలంక సైన్యం చేతిలో ప్రభాకరన్ ప్రాణాలు కోల్పోయాడు. ప్రభాకరన్ మరణానంతరం ఎల్టీటీఈ సారథ్య బాధ్యతలను పధ్మనాథన్ స్వీకరించాడు. పధ్మనాథన్ కోసం ఇంటర్పోల్ కూడా వెతుకుతోంది. ఆయుధాల అక్రమ రవాణాలో పధ్మనాథన్కు గట్టిపట్టుంది. ఆయుధాల అక్రమ రవాణాకు సంబంధించిన కేసులపై పధ్మనాథన్ ఇంటర్పోల్ నిఘాలో ఉన్నాడు.