Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తైవాన్‌లో వరదలు: 500 మంది మృతి

Advertiesment
తైనాన్
, మంగళవారం, 11 ఆగస్టు 2009 (19:20 IST)
తైవాన్‌ను భారీ వర్షాలు ముంచెత్తాయి. ఈ కారణంగా సంభవించిన వరదల కారణంగా మంగళవారానికి 500 మంది మృత్యువాత పడ్డారు. చైనా తూర్పు తీరంతో పాటు తైవాన్‌లో ఈ జలప్రళయం సంభవించింది.

తైవాన్‌ తీర ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు ఒక బహుళ అంతస్తుల కలిగిన భవనం కూడా నేలమట్టమైంది. అనేక గ్రామాలకు గ్రామలే జలమయమయ్యాయి. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.

వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. మంచినీరు కలుషితమై ప్రజలు రోగాల భారిన పడి తీవ్ర ఇబ్బందు లెదుర్కొంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu