Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఢిల్లీ, జార్జీయా ఘటనల వెనుక ఇరాన్ హస్తం : ఇజ్రాయిల్ పీఎం

Advertiesment
న్యూఢిల్లీ
, మంగళవారం, 14 ఫిబ్రవరి 2012 (12:33 IST)
భారత్ రాజధాని న్యూఢిల్లీలో అత్యంత పటిష్ట భద్రత ఉండే ఔరంగజేబు రోడ్డులో సోమవారం బాంబు పేలుడు సంభవించిన ఘటనలో ఇరాన్ హస్తం ఉండవచ్చని ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెత్యన్యాహు అభిప్రాయపడ్డారు. అలాగే జార్జీయాలోని టిబిలిసిలో కూడా ఇజ్రాయిల్ దౌత్యకార్యాలయ వాహనంలో ఓ బాంబును నిర్వీర్యం చేసిన సంఘటనలో కూడా ఇరాన్‌ కుట్ర దాగి వుండొచ్చని సందేహం వ్యక్తం చేశారు.

సొంత పార్టీ చట్టసభ్యులను ఉద్దేశించి ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెత్యన్యాహూ మాట్లడుతూ ఈ కుట్రల వెనుక ప్రపంచంలో పెద్ద ఎత్తున ఉగ్రవాదులను ఎగుమతి చేస్తున్న ఇరాన్ అని స్పష్టం చేశాడు. అయితే ఈ సంఘటనలో ఇరాన్, దాని మద్దతు గల హిజ్బుల్ (లెబనాన్‌కు) చెందిన ఉగ్రవాద సంస్థ కారణమని పేర్కొన్నారు.

ఇదే అంశంపై భారత్‌లో ఇజ్రాయిల్ రాయబారి మాట్లాడుతూ ఈ సంఘటనపై ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెత్యన్యాహూ ఇక్కడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారని, ఈ సంఘటన అనుకోనిది కాదని అయితే ఇజ్రాయిల్ ప్రజలను ఉద్దేశించి జరుగుతున్న దాడులుగా ఒక టీవీ ఛానెల్‌కు తెలిపారు. అయితే భారత్‌లోని తమ అధికారుల భద్రతపై తమకు ఎలాంటి అనుమానాలు లేవని, భారత్ అధికారులపై తమకు పూర్తి విశ్వాసం ఉందని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu