Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జకార్తా బాంబర్ల ఊహాచిత్రాల విడుదల

Advertiesment
ఇండోనేషియా
ఇండోనేషియా రాజధాని జకార్తాలో ఇటీవల రెండు లగ్జరీ హోటళ్లపై జరిగిన బాంబు దాడుల్లో పాల్గొన్న ఆత్మాహుతి దళ సభ్యుల ఊహాచిత్రాలను అధికారిక యంత్రాంగం విడుదల చేసింది. జకార్తాలోని ప్రధాన వ్యాపార కేంద్రంలో ఉన్న జేడబ్ల్యూ మారియట్, రిట్జ్- కార్ల్‌టన్ లగ్జరీ హోటళ్లలో ఐదు నిమిషాల తేడాతో శుక్రవారం బాంబు పేలుళ్లు సంభవించాయి.

ఈ పేలుళ్లలో ఇద్దరు ఆత్మాహుతి దళ సభ్యులు పాల్గొన్నట్లు అధికారిక వర్గాలు అనుమానిస్తున్నారు. తాజాగా ఈ ఇద్దరు అనుమానితుల ఊహాచిత్రాలను ఇండోనేషియా అధికారిక యంత్రాంగం విడుదల చేసింది. దాడులకు జెమాహ్ ఇస్లామియా అనే తీవ్రవాద సంస్థ కారణమని ఆరోపణలు వస్తున్నాయి.

ఇండోనేషియాలో గతంలోనూ ఈ తీవ్రవాద ముస్లిం గ్రూపు దాడులు చేసింది. రెండు హోటళ్లపై జరిగిన ఆత్మాహుతి దాడుల్లో తొమ్మిది మంది మృతి చెందగా, 53 మంది గాయపడ్డారు. బాంబు పేలుళ్లలో మృతి చెందిన ఇద్దరు అనుమానితుల తలభాగాలను ఆధారంగా చేసుకొని ఊహాచిత్రాలు తయారు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu