నేపాల్లో రాజకీయ పరిణామాలు మరోమారు అస్థిరతకు దారితీస్తున్నాయి. నేపాల్ ప్రధాని మాధవకుమార్, మావోయిస్టు చీఫ్ ప్రచండల మధ్య శనివారం జరిగిన చర్చలు విఫమయ్యాయి. దీంతో మావోయిస్టులు, 11 రాజకీయ పార్టీల మధ్య గతంలో కుదిరిన శాంతి ప్రక్రియకు విఘాతం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా, చర్చల విఫలం కావడంతో పార్లమెంటును స్థంభింపచేసే కార్యక్రమాన్ని కొనసాగించాలని మావోయిస్టులు సంకల్పించారు.
ఫలితంగా వచ్చే వేసవిలో కొత్త రాజ్యాంగాన్ని అమలులోకి తెచ్చే ప్రక్రియకు విఘాతం ఏర్పడనుంది. ఇదిలావుండగా, బ్రిటన్కు వెళ్లేముందు మాజీ ప్రధాని ప్రచండ మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంటులో చర్చకు అనువైన పరిస్థితి కల్పించేందుకు ప్రధానమంత్రి అంగీకరిస్తే మా నిరసనను ఉపసంహరించు కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.
అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదన్నారు. నేపాల్ సైనికదళ ప్రధానాధికారి జెనరల్ రుక్మాంగద్ కటవాల్తో గొడవ కారణంగా ఎనిమిది నెలల మవోయిస్టు ప్రభ్వుం మే నెలలో అధికారం నుంచి దిగిపోయిన విషయం తెల్సిందే. అప్పటి నుంచీ ఈ అంశంపై పార్లమెంటులో చర్చకోసం మావోయిస్టులు ఎదురు చూస్తున్నారు.