Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కూలేముందే తునకలైన ఎయిర్‌ఫ్రాన్స్ జెట్

Advertiesment
ఎయిర్ ఫ్రాన్స్ విమానం
బ్రెజిల్ రాజధాని రియో డి జెనీరో నుంచి పారిస్ వెళుతూ అట్లాంటిక్ మహాసముద్రంలో కూలిపోయిన ఎయిర్‌ఫ్రాన్స్ జెట్ విమానం.. ఆకాశంలోనే రెండు ముక్కలు అయిందని ఆదివారం మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ విమాన ప్రమాదంలో 228 మంది ప్రాణాలు కోల్పోయారు.

టాకాఫ్ తీసుకున్న నాలుగు గంటల తరువాత రాడార్ స్క్రీన్‌పై అదృశ్యమైన ఎయిర్‌ఫ్రాన్స్ జెట్ అనంతరం సముద్రంలో కూలిపోయింది. ఈ విమాన ప్రమాదంలో జరిగిన దర్యాప్తులో విమానం ఆకాశంలోనే రెండు ముక్కలయిందని తెలుస్తోంది.

ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ ప్రమాదం సంభవించిందని పరిశోధకలు నిర్ధారణకు వచ్చారు. విమానం కూలిపోయిన ప్రాంతంలో దొరికిన మృతదేహాలను పరిశీలించిన అనంతరం.. వారు సముద్ర ఉపరితలాన్ని తాకిన అనంతరం మృతి చెందారని సండే టైమ్స్ కథనం వెల్లడించింది.

Share this Story:

Follow Webdunia telugu