Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కార్గిల్ యుద్ధంతోనే భారత్ చర్చలకు వచ్చింది

Advertiesment
కార్గిల్
పాకిస్థాన్‌కు కూడా కార్గిల్ యుద్ధం పెద్ద విజయాన్ని సాధించిపెట్టిందని ఆ దేశ మాజీ సైనిక నియంత జనరల్ పర్వేజ్ ముషారఫ్ అభిప్రాయపడ్డారు. కార్గిల్ యుద్ధం కారణంగానే భారత ప్రభుత్వం కాశ్మీర్‌పై పాకిస్థాన్‌తో చర్చలకు అంగీకరించిందని తెలిపారు. 1999లో ఇరుదేశాల మధ్య జరిగిన కార్గిల్ యుద్ధంలో భారత సేనలు పాక్ సైనిక చొరబాటుదారులను విజయవంతంగా తిప్పికొట్టిన సంగతి తెలిసిందే.

ఈ యుద్ధంలో వాస్తవానికి పాకిస్థాన్ కార్గిల్ నుంచి వెనుదిరిగినప్పటికీ, భారత్ వైఖరిలో మార్పు తేవడంలో తాము ఈ యుద్ధం ద్వారా విజయవంతమయ్యామన్నారు. కాశ్మీర్‌పై భారత్ చర్చలు ఎలా ప్రారంభమయ్యాయని ముషారఫ్ ప్రశ్నించారు. కాశ్మీర్ వివాదంపై భారతీయులు చర్చల ద్వారా పరిష్కారం కనుగొనేందుకు ముందుకొచ్చారని, ఇదంతా కార్గిల్ యుద్ధ ఫలితమేనని తెలిపారు.

భారత టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ముషారఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. కార్గిల్ యుద్ధానికి ముందు ఇరుదేశాల మధ్య కాశ్మీర్ వివాదంపై చర్చల ప్రక్రియలేమీ లేవనే విషయాన్ని ముషారఫ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. 1999లో జరిగిన వివాదాస్పద కార్గిల్ యుద్ధాన్ని అదే ఏడాది రక్తపాతరహిత తిరుగుబాటు ద్వారా పాకిస్థాన్ పాలనా పగ్గాలు చేపట్టిన ముషారఫ్ గట్టిగా సమర్థించుకున్నారు.

తన హయంకు ముందు పాకిస్థాన్ పాలకులు కాశ్మీర్ అంశాన్ని పట్టించుకునేవారు కాదు. ఐక్యరాజ్యసమితిలో తమ నేతలు చేసే ప్రసంగాల్లోనూ కాశ్మీర్ అంశం ఉండదు. ఎందుకంటే వారు భారత్ మద్దతుదారులు. అందువలనే భారత్ దీనిపై అంతకుముందు చర్చలకు రాలేదు. అయితే కార్గిల్ యుద్ధం తరువాత పరిస్థితిలో మార్పు వచ్చిందన్నారు.

కాశ్మీర్‌పై చర్చలకు భారత్ ముందుకొచ్చిందని పేర్కొన్నారు. కార్గిల్ ఆపరేషన్‌లో పాల్గొన్నవారిలో పాకిస్థాన్ ఆర్మీలోని రావల్పిండి కార్ప్స్, ఫోర్స్ కమాండ్ నార్తరన్ ఏరియాస్ సిబ్బంది ఉన్నారని ముషారఫ్ అంగీకరించారు. కార్గిల్ యుద్ధంలో పాల్గొన్నవారు స్వాతంత్ర్య సమరయోధులని, తమ సైన్యం కాదని గతంలో పాకిస్థాన్ ప్రభుత్వం వాదించిన సంగతి తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu