Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇరాన్‌లో హింసాకాండ తక్షణం నిలిపివేయాలి

Advertiesment
ఇరాన్
ఇరాన్‌లో వివాదాస్పద అధ్యక్ష ఎన్నికల అనంతరం చెలరేగిన హింసాకాండను తక్షణం నిలిపివేయాలని ప్రపంచ దేశాలు పిలుపునిచ్చాయి. ఇరాన్‌లో జరుగుతున్న ఎన్నికల హింసాకాండను జి-8 దేశాల విదేశాంగ మంత్రులు ఖండించారు. ఈ హింసాకాండను తక్షణం నిలిపివేయాలని పిలుపునిచ్చారు.

ఇటలీలో శుక్రవారం జి-8 దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తీర్మానించిన వివరాలను ఇటలీ విదేశాంగ మంత్రి ఫ్రాంకో ఫ్రాటినీ వెల్లడించారు. ఇరాన్‌లో హింసాకాండను వెంటనే నిలిపివేయాలని జి-8 దేశాలు కోరుకుంటున్నాయని తెలిపారు. ఇరాన్ హింసాకాండ బాధితులకు సానుభూతి తెలియజేశారు.

ఇరాన్‌లో రెండు వారాల క్రితం జరిగిన వివాదాస్పద అధ్యక్ష ఎన్నికలపై ఆ దేశంలో పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతోంది. ఈ ఆందోళన కారణంగా ఇరాన్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

అహ్మదీనెజాద్ తిరిగి అధ్యక్ష పదవికి ఎన్నికవడంపై ఆయన ఎన్నికల ప్రత్యర్థులు ఈ ఆందోళనలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇరాన్‌లో నెలకొన్న రాజకీయ పరిష్కారానికి శాంతియుత పరిష్కారం కనుగొనాలని జి- 8 దేశాల విదేశాంగ మంత్రులు పిలుపునిచ్చారు. ఇరాన్ ఎన్నికల హింసాకాండలో సుమారు 17 మంది ప్రాణాలు కోల్పోయారు.

Share this Story:

Follow Webdunia telugu