Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇంటర్‌పోల్ సాయం కోరిన పాక్ ప్రభుత్వం

Advertiesment
ఇంటర్పోల్
ముంబయి ఉగ్రవాద దాడులపై దర్యాప్తు జరుపుతున్న పాకిస్థాన్ అధికారిక యంత్రాంగం.. ఈ దాడుల్లో ప్రమేయం ఉందని అనుమానిస్తున్న నిందితులను పట్టుకునేందుకు ఇంటర్‌పోల్ సాయం కోరింది. ముంబయి ఉగ్రవాద దాడులకు సంబంధించి 13 మంది అనుమానితులను పట్టుకునేందుకు సాయపడాలని ఇంటర్‌పోల్‌‍కు విజ్ఞప్తి చేసింది.

పాకిస్థాన్ పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న 13 మంది అనుమానితుల్లో నిషేధిత లష్కరే తోయిబా తీవ్రవాద సంస్థ సభ్యులు కూడా ఉన్నారు. వీరిని పట్టుకునేందుకు ఇంటర్‌పోల్ సాయం కోరడం ద్వారా పాకిస్థాన్ ప్రభుత్వం ముంబయి దాడుల దర్యాప్తును అంతర్జాతీయ స్థాయికి విస్తరించింది.

పోలీసు యంత్రాంగం వాంటెడ్ లిస్ట్‌లో ఉన్న 13 మందిని పట్టుకునేందుకు సాయపడాలని పాక్ ప్రభుత్వం ఓ లేఖ ద్వారా విజ్ఞప్తి చేసిందని ఇంటర్‌పోల్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ విజ్ఞప్తి ద్వారా ఇంటర్‌పోల్ సభ్యదేశాలు తీవ్రవాద అనుమానితులను పట్టుకోవడంలో పాకిస్థాన్ ప్రభుత్వానికి సహకరిస్తాయి. ఇదిలా ఉంటే పాకిస్థాన్ ప్రభుత్వం పట్టుకోవాలనుకుంటున్న 13 మంది తీవ్రవాదుల వివరాలేవీ ఇంటర్‌పోల్ తాజా ప్రకటనలో వెల్లడించలేదు.

Share this Story:

Follow Webdunia telugu