పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్లకు అమెరికా ప్రత్యేక రాయబారిగా వ్యవహరిస్తున్న రిచర్డ్ హోల్బ్రూక్ మరోసారి దక్షిణాసియా పర్యటనకు వస్తున్నారు. గత నెల రోజుల్లో దక్షిణాసియా దేశాల్లో హోల్బ్రూక్ పర్యటించడం ఇది రెండోసారి. గత పర్యటనలోనూ భారత్కు దూరంగా ఉన్న హోల్బ్రూక్ ఈసారి కూడా భారత పర్యటనకు వచ్చే అవకాశం కనిపించడం లేదు.
ఈసారి కూడా ఆయన ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ దేశాల్లోనే పర్యటించనున్నారు. శుక్రవారం పాకిస్థాన్ పర్యటనకు రానున్న హోల్బ్రూక్ అనంతరం ఆఫ్ఘనిస్థాన్ వెళతారు. అనంతరం టర్కీ రాజధాని ఇస్తాంబుల్లో జరిగే ఓ సమావేశానికి ఆయన హాజరవతారు.
అమెరికా విదేశాంగ కార్యదర్శి హిల్లరీ క్లింటన్ గత నెలలో భారత్లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ పర్యటన తరువాత హోల్బ్రూక్ భారత్కు రావాల్సి ఉంది. అయితే కొన్ని అనివార్య కారణాల వలన ఈ పర్యటన వాయిదా పడింది. తాజాగా ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ దేశాల పర్యటన సందర్భంగా భారత్ వెళ్లే ప్రణాళికలేవీ లేవని హోల్బ్రూక్ అమెరికా అధికారులతో బుధవారం చెప్పారు.