Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆఫ్ఘనిస్థాన్‌లో మరో బ్రిటన్ సైనికుడి మృతి

Advertiesment
బ్రిటన్
ఆఫ్ఘనిస్థాన్‌లో బాంబు పేలుడులో గాయపడిన ఓ బ్రిటన్ సైనికుడు శనివారం మృతి చెందాడు. దీంతో ఇప్పటివరకు ఆప్ఘనిసస్థాన్‌లో తాలిబాన్ తీవ్రవాదులతో పోరాడుతూ మృతి చెందిన మొత్తం బ్రిటన్ సైనికుల సంఖ్య 200కి చేరుకుంది.

బ్రిటన్ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. రెండో బెటాలియన్‌కు చెందిన రాయల్ వెల్ష్ అనే సైనికుడు ఆఫ్ఘనిస్థాన్‌లో తీవ్రవాదులు బాంబు దాడిలో గాయపడ్డాడు. అనంతరం చికిత్స నిమిత్తం అతనిని ఇంగ్లండ్‌కు తరలించారు.

ఇంగ్లండ్‌లో ఓ మిలిటరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాయల్ వెల్ష్ శనివారం కన్నుమూశాడు. దక్షిణ ఆఫ్ఘనిస్థాన్‌లోని హెల్మండ్ ప్రావీన్స్‌లో జరిగిన రెండు బాంబు దాడుల్లో ముగ్గురు బ్రిటన్ సైనికులు సంఘటనా స్థలంలోనే మృతి చెందారు.

గాయపడిన రాయల్ వెల్ష్ శనివారం ప్రాణాలు కోల్పోయాడు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్‌లో 900 మంది బ్రిటన్ సైనికులు విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో ఎక్కువమంది తాలిబాన్ తీవ్రవాదులకు గట్టిపట్టు ఉన్న హెల్మండ్ ప్రావీన్స్‌లో ఉన్నారు.

Share this Story:

Follow Webdunia telugu