Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'కాశ్మీర్‌ను శ్మశానంగా మారుస్తాం' : హిజ్‌బుల్ ముజాహిద్దీన్ చీఫ్

కాశ్మీర్‌ను శ్మశానంగా మారుస్తామని హిజ్‌బుల్ ముజాహిద్దీన్ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్ హెచ్చరించాడు. ఇందుకోసం కాశ్మీరీలను ఆత్మాహుతి దళాలుగా మారుస్తామని ప్రకటించాడు. భారత హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సారథ్యంలో

'కాశ్మీర్‌ను శ్మశానంగా మారుస్తాం' : హిజ్‌బుల్ ముజాహిద్దీన్ చీఫ్
, ఆదివారం, 4 సెప్టెంబరు 2016 (17:07 IST)
కాశ్మీర్‌ను శ్మశానంగా మారుస్తామని హిజ్‌బుల్ ముజాహిద్దీన్ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్ హెచ్చరించాడు. ఇందుకోసం కాశ్మీరీలను ఆత్మాహుతి దళాలుగా మారుస్తామని ప్రకటించాడు. భారత హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సారథ్యంలో కాశ్మీర్‌ సమస్య పరిష్కారానికి అన్ని వర్గాలతో చర్చిచేందుకు అఖిల పక్ష సమావేశం ఏర్పాటుపై పెదవి విరిచిన ఆయన 'కాశ్మీర్ శాంతి స్థాపనకు ఎలాంటి మార్గాలు లేవు. కాశ్మీర్ నాయకత్వం, ప్రజలు, ముజాహిద్దీన్‌లు ఈ విషయం తెలుసుకోవాలి' అని ఒక ఇంటర్వ్యూలో సైయద్ సలావుద్దీన్ తేల్చిచెప్పాడు. 
 
ఇదే అంశంపై ఆయన ఇంకా మాట్లాడుతూ... కాశ్మీర్ ప్రాంతం మొత్తాన్ని ఉగ్రవాద గొడుకు కిందకు తీసుకువచ్చి, ఆ ప్రాంతాన్ని శ్మశానంగా మార్చుతామని ప్రకటించాడు. మరిన్ని సైనిక బలగాలను మోహరించడం వల్ల తీవ్రవాద ఉద్యమం మరింత బలపడుతుందన్నాడు. సైనిక శక్తిని ఉపయోగించి ఎంత బలంగా అణిచివేస్తే అంతకంటే బలంగా వేర్పాటువాద ఉద్యమం, స్వాంతత్ర్య కాంక్ష బలపడతాయని తెలిపాడు. కాశ్మీర్ ప్రస్తావన లేకుండా చర్చల ప్రసక్తే లేదని తేల్చి చెప్పాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెళ్లి బారాత్‌లో 10 రౌండ్ల తుపాకీ కాల్పులు.. పోలీసుల అదుపులో పెళ్లికొడుకు