Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కొరియా అధ్యక్ష భవనం 360 వయాగ్రా ట్యాబ్లెట్లు కొనుగోలు చేసిందా? ఎందుకో తెలుసా?

దక్షిణ కొరియా అధ్యక్షురాలు పార్క్ గ్వెన్ హ్వే కార్యాలయం వివాదంలో చిక్కుకుంది. ఇప్పటికే అవినీతి ఆరోపణలతో ఇబ్బంది పడిపోతున్న పార్క్ గ్వెన్.. కొత్త వివాదంలో చిక్కుకున్నారు. గ్వెన్ హ్వే కార్యాలయం వయాగ్రా

Advertiesment
కొరియా అధ్యక్ష భవనం 360 వయాగ్రా ట్యాబ్లెట్లు కొనుగోలు చేసిందా? ఎందుకో తెలుసా?
, గురువారం, 24 నవంబరు 2016 (12:16 IST)
దక్షిణ కొరియా అధ్యక్షురాలు పార్క్ గ్వెన్ హ్వే కార్యాలయం వివాదంలో చిక్కుకుంది. ఇప్పటికే అవినీతి ఆరోపణలతో ఇబ్బంది పడిపోతున్న పార్క్ గ్వెన్.. కొత్త వివాదంలో చిక్కుకున్నారు. గ్వెన్ హ్వే కార్యాలయం వయాగ్రా ట్యాబ్లెట్లు కొనడం నిజమేనని ప్రతిపక్ష ఎంపీ వ్యాఖ్యలు నిజమేనని.. ఒప్పుకోవడం వివాదానికి తెరదీసింది. దక్షిణ కొరియా అధ్యక్ష భవనం తెలిపిన వివరాల ప్రకారం.... 360 వయాగ్రా ట్యాబ్లెట్లను కొనుగోలు చేశామని ప్రకటించింది. 
 
సాధారణంగా వయాగ్రా టాబ్లెట్లు ఆల్టిట్యూడ్‌ సిక్‌ నెస్‌‌ను నివారిస్తాయని నమ్ముతుండటం వల్ల పర్వతారోహకుల కోసం దక్షిణ కొరియా వైద్యులు వీటిని సిఫారసు చేస్తుంటారు. ఇందులో భాగంగా.. వచ్చే ఏడాది మే నెలలో అధ్యక్షురాలు ఇథియోపియా, ఉగాండా, కెన్యా పర్యటనలకు వెళ్లనున్నట్లు గ్వెన్ హ్వే కార్యాలయం ప్రకటించింది.
 
ఆ దేశాలు సముద్రమట్టం కంటే ఒకటి, రెండు కిలోమీటర్ల ఎత్తులో ఉండటం ద్వారా అధ్యక్షురాలి సహాయక సిబ్బందికి... ఎత్తుకు సంబంధించిన రుగ్మత (ఆల్టిట్యూడ్‌ సిక్‌ నెస్‌) తలెత్తితే దానిని నివారించటం కోసం ఈ ట్యాబ్లెట్లను కొనుగోలు చేసినట్లు ప్రకటించింది. కొనుగోలు చేసిన ట్యాబ్లెట్లలో ఏ ఒక్కటీ ఇప్పటికీ వాడలేదని అధ్యక్ష భవనం బ్లూ హౌస్‌ ప్రకటించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏకఛత్రాధిపతిగా తితిదే పాలన.... నియంతలా మారిన ఈవో సాంబశివరావు