Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మా దేశంలో ఎందుకున్నావ్.. నీ దేశం వెళ్లిపో... సిక్కు వ్యక్తిపై అమెరికాలో కాల్పులు

అమెరికాలో భారతీయ సిక్కు వ్యక్తిపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. మా దేశంలో ఎందుకుంటున్నావ్... నీ దేశంలో వెళ్లిపో అంటూ హెచ్చరిస్తూ కాల్పులు జరిపారు. అమెరికాలో జాత్యహంకార దాడిలో తెలుగు టెక్కీ

Advertiesment
America
, ఆదివారం, 5 మార్చి 2017 (10:31 IST)
అమెరికాలో భారతీయ సిక్కు వ్యక్తిపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. మా దేశంలో ఎందుకుంటున్నావ్... నీ దేశంలో వెళ్లిపో అంటూ హెచ్చరిస్తూ కాల్పులు జరిపారు. అమెరికాలో జాత్యహంకార దాడిలో తెలుగు టెక్కీ శ్రీనివాస్‌ కూచిభోట్ల మరణించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కూడా దాడులు కొనసాగుతున్నాయి. 39 యేళ్ల బాధితుడు (సిక్కు వ్యక్తి) కెంట్‌లోని ఈస్ట్ హిల్స్‌లో తన వాహనంలో వెళ్తుండగా కాల్పులు జరిగాయి. 
 
అతను వెళ్తుండగా ఓ గుర్తు తెలియని వ్యక్తి తన వద్దకు వచ్చాడని కెంట్ పోలీసులకు బాధితుడు చెప్పారు. ఈ దేశం వదిలి వెళ్లాలని తనతో నిందితుడు చెప్పాడని, ఆ తర్వాత కాల్చాడని చెప్పారు. నిందితుడు 6 అడుగుల పొడవు ఉన్నాడని, మాస్క్ ధరించాడని బాధితుడు పోలీసులకు వెల్లడించారు. నిందితుడిని పట్టుకునేందుకు కెంట్ పోలీసులు ఎఫ్‌బీఐ సహకారం కోరారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రిలయన్స్ జియోకు షాకిచ్చిన వోడాఫోన్... మరో బంపర్ ఆఫర్