అమెరికా ఎన్నికలు : అంతరిక్షం నుంచి ఓటేసిన వ్యోమగాములు.. డిగ్జ్ విల్లేనాచ్లో హిల్లరీ గెలుపు
ప్రపంచ ప్రజలు అత్యంత ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో భాగంగా తొలి ఫలితం మంగళవారం ఉదయం వెల్లడైంది. ఈ ఫలితాల్లో న్యూ హ్యాంప్షైర్లోని డిగ్జ్ విల్లే నాచ్లో ఎన్నికలు పూర్త
ప్రపంచ ప్రజలు అత్యంత ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో భాగంగా తొలి ఫలితం మంగళవారం ఉదయం వెల్లడైంది. ఈ ఫలితాల్లో న్యూ హ్యాంప్షైర్లోని డిగ్జ్ విల్లే నాచ్లో ఎన్నికలు పూర్తికాగా, కౌంటింగ్ చేసి ఫలితాన్ని వెల్లడించారు. డెమోక్రాటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ 4-2 ఓట్ల తేడాతో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్పై విజయం సాధించారు. ఇది హిల్లరీకి తొలి గెలుపు కాగా, ఈ ఎన్నికల్లో వెల్లడైన తొలి ఫలితం. ఈ ప్రాంతం కెనడా సరిహద్దులకు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. 8వ తేదీ ప్రవేశించగానే అర్థరాత్రి 12:01కి పోలింగ్ ప్రారంభం కాగా, ఊళ్లోని ఓటర్లంతా వెంటనే ఓట్లు వేయడం, అందరూ ఓటేయగానే వాటిని లెక్కించడం పూర్తయింది.
ఈ ప్రాంతంలో మొత్తం 8 మంది రిజిస్టర్ ఓటర్లు ఉండగా, వీరిలో నలుగురు హిల్లరీకి ఓటువేయగా, మరో ఇద్దరు ట్రంప్కు, ఇంకో ఇద్దరు మిట్ రోమ్నీ, గ్యారీ జాన్సన్లకు ఓటు వేశారు. దీంతో తన సమీప ప్రత్యర్థి ట్రంప్ కన్నా రెండు ఓట్ల మెజారిటీతో హిల్లరీ విజయం సాధించినట్లయింది. కాగా, పలు చోట్ల ఓటింగ్ జరుగుతుండగా, అత్యధిక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల తర్వాత (భారత కాలమానం ప్రకారం) ఓటింగ్ మొదలు కానుంది.
ఇదిలావుండగా, భూమికి 17 వేలి మైళ్ళ దూరంలో ఉన్న అంతరిక్షపరిశోధనా కేంద్రంలో పని చేసే వ్యోమగాములు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. షాన్ కిమ్బ్రో అనే వ్యోమగామి ఎలక్ట్రానిక్ ఎబ్సెంటీ బ్యాలెట్ విధానం ద్వారా తన ఓటు వేసినట్టు నాసా వెల్లడించింది. మరో వ్యోమగామి కేట్ రూబిన్స్ స్పేస్ సెంటర్ నుంచి భూమికి తిరిగి వెళ్లేముందే స్పేస్ సెంటర్ నుంచి ఓటును వేసినట్టు పేర్కొంది. స్పేస్ సెంటర్లో పని చేసే వ్యోమగాములకు ఓటు వేసేందుకు అనుమతిచ్చినందుకు సంతోషం వ్యక్తం చేశారు. వీరిద్దరు హ్యూస్టన్ ప్రాంతానికి చెందన వ్యోమగాములు కాగా, వీరిద్దరు జాన్సన్ స్పేస్ సెంటర్లో పని చేస్తున్నారు.