Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కేరళకు చెందిన వ్యక్తికి రూ.45కోట్ల జాక్ పాట్

కేరళకు చెందిన వ్యక్తికి రూ.45కోట్ల జాక్ పాట్
, శుక్రవారం, 17 నవంబరు 2023 (13:15 IST)
యూఏఈలో ఉంటున్న కేరళ వాసి జీవితం ఒక్కరోజులో మారిపోయింది. అక్కడ నిర్వహించిన లాటరీలో ఆ వ్యక్తికి 45 కోట్ల రూపాయల జాక్‌పాట్ తగిలింది. ఈ వార్త విని షాక్ అయ్యాడు.
 
కేరళకు చెందిన 39 ఏళ్ల శ్రీజు 11 ఏళ్ల క్రితం యూఏఈకి వలస వెళ్లాడు. అక్కడ ఓ ఆయిల్ కంపెనీలో కంట్రోల్ రూమ్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. ఇంతలో, మహ్జూజ్ సాటర్డే మిలియన్స్ డ్రా కోసం టిక్కెట్ కొన్నాడు. బుధవారం లాటరీ డ్రా జరిగింది. ఆ తర్వాత శ్రీజు జీవితం మారిపోయింది.
 
ఆ లాటరీలో శ్రీజుకు 45 కోట్ల జాక్‌పాట్ వచ్చింది. ఈ సందర్భంగా శ్రీజు మాట్లాడుతూ.. "అప్పుడు నేను కారులో ఉన్నాను. నేను నా మహ్జూజ్ ఖాతాను చూడాలని భావించి దాన్ని తెరిచాను. నా కళ్ళు తిరిగాయి. నేను గెలిచానని నమ్మలేకపోయాను. మహ్జూజ్ సిబ్బంది ఫోన్ చేసి చెప్పే వరకు నేను నమ్మలేదు" అని శ్రీజూ చెప్పారు.
 
అరబ్ దేశాల్లో ఇలాంటి వారు చాలా మంది ఉన్నారు. అక్కడ డ్రా చేసే లాటరీల్లో చాలా మంది జాక్‌పాట్ కొట్టేస్తున్నారు. ఈ వార్త ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తోంది.
 
ఈ మహ్జూజ్ లక్కీ డ్రాలో మరో భారతీయుడు కూడా జాక్‌పాట్ కొట్టాడు. ముంబైకి చెందిన మనోజ్ భావ్‌సర్ 16 ఏళ్లుగా అబుదాబిలో ఎలక్ట్రానిక్స్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. 42 ఏళ్ల ఈ ముంబై నివాసికి రూ. 16 లక్షలు లభించాయి.
 
కేరళలో లాటరీల మాదిరిగా కాకుండా, UAE ఎలాంటి పన్ను తగ్గింపు లేకుండా విజేతకు పూర్తి మొత్తాన్ని అందజేస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత్‌లో అందరూ వాడే కామన్ పాస్‌వర్డ్ ఏదో తెలుసా?