Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చైనా టైఫూన్.. వియత్నాంలో 141 మంది మృతి.. 59మంది గల్లంతు (video)

Typhoon Yagi

సెల్వి

, బుధవారం, 11 సెప్టెంబరు 2024 (12:11 IST)
Typhoon Yagi
చైనా టైఫూన్ పర్యవసానంగా కొండచరియలు విరిగిపడటం, వరదల కారణంగా వియత్నాం ప్రాంతంలో 141 మంది మరణించారు. 59 మంది తప్పిపోయినట్లు అధికారులు ప్రకటించారు. 
 
మృతుల్లో 29 మంది కావో బ్యాంగ్ ప్రావిన్స్‌కు చెందినవారు, 45 మంది లావో కై ప్రావిన్స్‌కు చెందినవారు. 37 మంది యెన్ బాయి ప్రావిన్స్‌కు చెందినవారు.
 
క్యూయెట్ థాంగ్ కమ్యూన్ గుండా ప్రవహించే లో రివర్ డైక్ నది నీటి పెరుగుదల కారణంగా గేట్లు తెగాయని తుయెన్ క్వాంగ్ ప్రావిన్స్ స్థానిక అధికారులు మంగళవారం ధృవీకరించారు.
 
రాజధాని హనోయిలోని రెడ్ నదిలో వరదల కారణంగా బుధవారం మధ్యాహ్నానికి అత్యధిక స్థాయికి చేరుకుంటాయని నేషనల్ సెంటర్ ఫర్ హైడ్రో-మెటియరోలాజికల్ ఫోర్‌కాస్టింగ్ అంచనా వేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏలేరు వరద సహాయక చర్యలపై పవన్ కీలక సమావేశం