Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమెరికా గడ్డ మీద జిహాదీలు లేకుండా చేస్తాం: డొనాల్డ్ ట్రంప్

అమెరికా దాని మిత్ర దేశాల ఉగ్రవాదాన్ని తుదముట్టిస్తాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని అంతం చేస్తామని ట్రంప్ ప్రతిజ్ఞ కూడా చేశారు.

అమెరికా గడ్డ మీద జిహాదీలు లేకుండా చేస్తాం: డొనాల్డ్ ట్రంప్
, మంగళవారం, 7 ఫిబ్రవరి 2017 (09:07 IST)
అమెరికా దాని మిత్ర దేశాల ఉగ్రవాదాన్ని తుదముట్టిస్తాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని అంతం చేస్తామని ట్రంప్ ప్రతిజ్ఞ కూడా చేశారు. ఫ్లొరిడాలోని టాంపాలో మాక్ డ్రిల్ ఎయిర్ ఫోర్స్ బేస్‌ను సందర్శించిన సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. అమెరికా గడ్డ మీద జిహాదీలు లేకుండా చేస్తామని ఉద్ఘాటించారు. 
 
అమెరికాకు మచ్చ తెచ్చిన 9/11 ఘటనను మర్చిపోలేమని, బోస్టన్, ఓర్లాండో, సాన్ బెర్నార్డినో, సహా ఐరోపా దేశాల్లో ఉగ్రవాదులు దాడులు చేసినట్లు గుర్తు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఐసిస్ ఉగ్రవాదులు భారీ దాడులకు పాల్పడుతున్నారని, వారిని మట్టుబెట్టేందుకు అమెరికా మిలటరీలో పెద్ద మొత్తంలో ఆర్థిక పెట్టుబడులు పెడతామన్నారు.
 
మధ్య ప్రాచ్య దేశాలు, మధ్య ఆసియాలో కూడా తీవ్రవాదాన్ని అంతం చేస్తామన్నారు. ‘కచ్చితంగా ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని అంతం చేస్తాం. అంతేకాదు, అది అమెరికాలో వేళ్లూనుకోకుండా చర్యలు తీసుకుంటాం. అదే  సమయంలో స్వేచ్ఛ, భద్రత, న్యాయాన్ని కాపాడుతామని ట్రంప్ పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శశికళ ఓ నిశాని... ప్రజలు ఎన్నుకున్న వారే పరిపాలించాలి: దీప