Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మోడీకి ట్రంప్ ఫోన్... ఫోన్‌ చేసిన తొలి ఐదుగురిలో ప్రధాని... భారత్ ట్రూ ఫ్రెండంటూ..

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అమెరికా కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డోనాల్డ్ ట్రంప్ స్వయంగా ఫోన్ చేశారు. భారత కాలమానం ప్రకారం, మంగళవారం రాత్రి 11.30 గంటలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో ఫోన్ల

మోడీకి ట్రంప్ ఫోన్... ఫోన్‌ చేసిన తొలి ఐదుగురిలో ప్రధాని... భారత్ ట్రూ ఫ్రెండంటూ..
, బుధవారం, 25 జనవరి 2017 (08:57 IST)
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అమెరికా కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డోనాల్డ్ ట్రంప్ స్వయంగా ఫోన్ చేశారు. భారత కాలమానం ప్రకారం, మంగళవారం రాత్రి 11.30 గంటలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో ఫోన్లో ఆయన మాట్లాడారు. అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, అధ్యక్షులు కావచ్చు.. ప్రధానులు కావచ్చు.. ఇప్పటి వరకూ నాలుగు దేశాల అధినేతలతో ట్రంప్‌ మాట్లాడారు. ఐదో దేశాధినేత మోడీనే. తద్వారా భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలకు పెద్దపీట వేస్తున్నట్టు చెప్పకనే చెప్పారు. 
 
గత ఎన్నికల ప్రచారంలో కూడా ఇజ్రాయెల్‌తోపాటు మరికొన్ని దేశాలతోనే సంబంధాలను బలోపేతం చేసుకుంటామని ట్రంప్‌ చెప్పారు. వాటిలో భారత ఒకటి. మోడీతో చర్చల సందర్భంగా, ద్వైపాక్షిక వాణిజ్యం, హెచ్‌1బీ వీసాలు, మేకిన్‌ ఇండియా, మేకిన్‌ అమెరికా, రక్షణతోపాటు ఇరువురి పర్యటనలకు సంబంధించిన అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది.
 
ఇదిలావుండగా, అమెరికాలోని వివిధ కీలక పదవుల్లో ట్రంప్‌ కూడా భారతీయులకు పెద్దపీట వేస్తున్నారు. నెట్‌ న్యూట్రాలిటీని తీవ్రంగా వ్యతిరేకించిన ప్రవాస భారతీయుడు అజిత వరదరాజ్‌ పాయ్‌ను ఫెడరల్‌ కమ్యూనికేషన్స్‌ కమిషన్‌ చీఫ్‌గా నియమించారు. నికీ హెలీ, సీమా వర్మ, ప్రీత భరారా తర్వాత, ట్రంప్‌ ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో నియమితుడైన నాలుగో వ్యక్తి అజిత కావడం విశేషం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జల్లికట్టు ఉద్యమం వెనుక శశికళ హస్తం.. కట్టుతెగడంతో చేతులెత్తేశారు...