Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

స్పెయిన్ పార్లమెంట్‌లో ఎలుక.. పరుగులు పెట్టిన సభ్యులు

స్పెయిన్ పార్లమెంట్‌లో ఎలుక.. పరుగులు పెట్టిన సభ్యులు
, గురువారం, 22 జులై 2021 (21:15 IST)
spain
స్పెయిన్ పార్లమెంట్‌ను ఓ మూషికం పరుగులు పెట్టించింది. స్పెయిన్‌లోని సెవిల్‌లో ఉన్న ఆండలూసియా పార్లమెంట్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
పార్లమెంట్‌లో సీరియస్‌గా మాట్లాడుతున్న స్పీకర్ మార్తా బోస్కెట్ ఆ ఎలుకను చూసి షాక్‌ తిన్నారు. అది గమనించిన మిగిలిన సభ్యులు కూడా సీట్లల నుంచి లేచి పరుగులు తీశారు. 
 
అనంతరం కాసేపటికి ఎలుకను బయటకు తోలేయగా ప్రస్తుతం ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు. ప్రజాప్రతినిధులై ఉండి ఎలుకను చూసి భయపడడం ఏంటని సెటైర్లు వేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీ రాష్ట్రంలో తగ్గుతున్న కేసులు.. 843మందికి పాజిటివ్