Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాడార్‌తో సంబంధాలు తెగిపోవడం వల్లే ఈజిప్టు ఫ్లైట్ ప్రమాదం

Advertiesment
EgyptAir jet
, శుక్రవారం, 20 మే 2016 (13:32 IST)
రాడార్‌తో సంబంధాలు తెగిపోవడం వల్లే ఈజిప్టుఎయిర్ ఫ్లైట్ అదృశ్యమై ప్రమాదానికి గురైందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ సంస్థకు చెందిన ఎంఎస్804 విమానం గురువారం అదృశ్యమై సముద్రంలో కూలి పోయింది. ఈ ప్రమాదంలో 66 మంది జలసమాధి అయ్యారు. వీరిలో ఒక చిన్నారితో సహా 56 మంది ప్రయాణికులు, 10 మంది సిబ్బంది ఉన్నారు. కాగా, ఈ విమాన శకలాల కోసం మధ్యదరా సముద్రంలో గాలిస్తున్నారు. 
 
ఫ్రాన్స్ రాజధాని పారీస్ నుంచి ఈజిప్టు రాజధాని కైరోకి బయల్దేరిన విమానం గురువారం తెల్లవారుజామున ఉన్నట్టుండి అదృశ్యమైంది. కూలిన ''ఎంఎస్ 804'' శకలాలను ఆగ్నేయ ఏజియన్ సముద్రంలో గ్రీస్‌కు చెందిన కర్పతోస్ ద్వీపం వద్ద.. కనుగొన్నామని ఈజిప్టు విదేశాంగ శాఖ ప్రకటించింది. విమానం కోసం మొత్తం మూడు దేశాల అధికారులు గాలింపులు చేపడుతున్నారు. విమానం గురువారం తెల్లవారుజామున 2.45 గంటలకు ఈజిప్టు గగనతలంలోకి ప్రవేశించిన కాసేపటికే 37 వేల అడుగుల ఎత్తులో ఉండగా రాడార్‌తో సంబంధాలను కోల్పోయింది. 
 
అలెగ్జాండ్రియా నగరానికి సమీపంలో చివరిసారిగా రాడార్‌పై కనిపించింది. మృతుల్లో ఈజిప్టుకు చెందిన 30 మంది, 15 మంది ఫ్రాన్స్ దేశీయులు ఉండగా మిగిలినవారు ఇరాక్, బ్రిటన్, బెల్జియం, కువైట్, సౌదీఅరేబియా, సుడాన్, కెనడా వాసులున్నారు. ప్రమాదం గురించి ప్రయాణికుల కుటుంబాలకు, సిబ్బంది కుటుంబసభ్యులకు సమాచారమిచ్చామన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సుప్రీంకోర్టు తీర్పుకు తాత్కాలిక బ్రేక్ : నీట్‌పై ఆర్డినెన్స్.. కేంద్రం సంచలన నిర్ణయం