Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గోల్డెన్ బే రెసార్ట్.. పళని స్వామిదే.. సోషల్ మీడియా జోకే నిజమైంది.. ఎలాగో తెలుసా?

గోల్డెన్ బే రెసార్ట్ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రెసార్ట్‌లో శశికళ వర్గం సృష్టించిన హంగామా అంతా ఇంతా కాదు. 120 మందికి పైగా అన్నాడిఎంకె ఎమ్మెల్యేలు పదిరోజులుగా గోల్డెన్ బే రిసార్ట్స్‌లో ఉ

Advertiesment
Sasikala
, గురువారం, 16 ఫిబ్రవరి 2017 (11:39 IST)
గోల్డెన్ బే రెసార్ట్ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రెసార్ట్‌లో శశికళ వర్గం సృష్టించిన హంగామా అంతా ఇంతా కాదు. 120 మందికి పైగా అన్నాడిఎంకె ఎమ్మెల్యేలు పదిరోజులుగా గోల్డెన్ బే రిసార్ట్స్‌లో ఉన్నారు. వీళ్లంతా మస్తుగా తాగి, ఫుల్లుగా తిని.. ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో ఎంజాయ్ చేశారు. వీళ్లంతా తన వాళ్లేనని, తనకే మద్దతునిస్తున్నారని శశికళ చెప్తూవచ్చారు.
 
అయి రిసార్ట్స్‌లో ఉన్న ఎఐఎడిఎంకె ఎమ్మెల్యేల శరీరాలు అక్కడ ఉన్నప్పటికీ వాళ్ల మనసంతా తన వైపే ఉందని.. వాళ్ల మద్దతు తనకేనని ధీమా వ్యక్తం చేశారు పన్నీర్ సెల్వం. ఇలా శశికళ, పన్నీర్ వర్గాలు చెబుతున్న వేళ సోషల్ మీడియాలో ఒక సెటైర్ పుట్టుకొచ్చి అందర్నీ ఆకర్షించింది.

అదేంటంటే... "నా దగ్గర 120మంది ఎమ్మెల్యేలున్నారు ప్రభుత్వ ఏర్పాటుకు నన్నూ పిలవండి" అంటూ గోల్డెన్ బే రిసార్ట్స్ ఓనర్ గవర్నర్ కి లేఖ రాశాడన్నది సోషల్ మీడియా పోస్ట్. అయితే, కేవలం హాస్యంకోసం సృష్టించిన ఈ సెటైరే ఇప్పుడు నిజం కాబోతోంది. ఆ గోల్డెన్ బే రిసార్ట్స్ పళనిస్వామిదేనన్నది వార్తలు వస్తున్నాయి.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమ్మో.. అంత డబ్బా.. భారీ నగలు.. చీరలు, గడియారాలు బాగానే కూడబెట్టారుగా