Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వ్యభిచార మహిళలను ఇంటికి పిలిపించుకుని చంపేశాడు.. ఎక్కడ?

murder
, శుక్రవారం, 8 సెప్టెంబరు 2023 (08:38 IST)
రువాండా దేశంలో దారుణం జరిగింది. ఈ దేశ రాజధాని కిగాలీలో ఓ వ్యక్తి అత్యంత కిరాతక చర్యకు పాల్పడ్డాడు. వేశ్యలను ఇంటికి పిలిపించుకుని వారిని చంపేసి, ఫోన్లు, ఇతర వస్తువులను దోచుకునే కిరాతకుడుని పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఈ సీరియల్ కిల్లర్ వేశ్యలను చంపేసిన తర్వాత ఆ మతదేహాలను కిచెన్‌లో గొయ్యి తీసి పాతిపెట్టేవాడు. 
 
ఇలా వరుసగా నేరాలకు పాల్పడుతున్న ఓ సీరియల్‌ కిల్లర్‌ను రువాండా రాజధాని కిగాలీ పోలీసులు అరెస్టు చేశారు. 34 ఏళ్ల నిందితుడి ఇంట్లో జరిపిన తవ్వకాల్లో 10 మృతదేహాల అవశేషాలు లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. అయితే అతడి చేతిలో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 14 వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. నిందితుడు కొన్ని మృతదేహాలను యాసిడ్‌ వేసి కరిగించినట్లు పోలీసులు తెలిపారు. 
 
ఆధార్ ఉచిత అప్‌డేట్ గడువు పొడగింపు  
 
ఆధార్ కార్డు ఉచిత అప్‌డేట్ గడువును మరోమారు పొడగించారు. ఈ నెల 14వ తేదీతో ఈ ఉచిత అప్‌డేట్ గడువు ముగియనుంది. దీంతో ఈ గడువును మరో మూడు నెలలు పొడగిస్తూ యూఐడీఏఐ నిర్ణయం తీసుకుంది. తాజాగా పొడగింపుతో కలుపుకుంటే ఈ ఉచిత అప్‌డేట్ గడువు డిసెంబరు 14వ తేదీ వరకు ఉంది. 
 
అప్పటిలోపు ఆధార్ కార్డులో ఉన్న తప్పొప్పులతో పాటు.. ఫోటో, చిరునామా, చేతి వేలిముద్రలు తదితర వివరాలను మార్చుకునే వెసులుబాటు ఉంది. సాధ్యమైనంత ఎక్కువ మంది ఆధార్ కార్డులో తమ డాక్యుమెంట్స్‌ అప్ డేట్ చేసుకునేలా ప్రోత్సహించే చర్యల్లో భాగంగా, ఈ గడువును ఈ నెల 14వ తేదీ నుంచి డిసెంబర్ 14వ తేదీ వరకు పొడగిస్తున్నట్టు యూఐడీఏఐ ఓ ప్రకటనలో తెలిపింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆధార్ ఉచిత అప్‌డేట్ గడువు పొడగింపు