Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పాకిస్థాన్‌లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. పోలీస్ శిక్షణా శిబిరంపై దాడి.. 60 మంది హతం

పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు మరోమారు రెచ్చిపోయారు. క్వెట్టాలోని పోలీస్ శిక్షణాశిబిరంపై విచక్షణా రహితంగా దాడి చేశారు. ఈ దాడిలో 59 మంది వరకు పోలీసులు హతమయ్యారు. సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఆత్మాహుతి జాక

Advertiesment
Quetta attack
, మంగళవారం, 25 అక్టోబరు 2016 (10:09 IST)
పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు మరోమారు రెచ్చిపోయారు. క్వెట్టాలోని పోలీస్ శిక్షణాశిబిరంపై విచక్షణా రహితంగా దాడి చేశారు. ఈ దాడిలో 59 మంది వరకు పోలీసులు హతమయ్యారు. సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఆత్మాహుతి జాకెట్లతో శిక్షణా శిబిరంలోకి ప్రవేశించి దాడికి పాల్పడినట్టు పాకిస్థాన్ మీడియా వెల్లడించింది. 
 
ఉగ్రవాదులు ముందుగా వాచ్‌ టవర్‌ సెంట్రీని లక్ష్యంగా చేసుకుని దాడులకు యత్నించారనీ, ఆ తర్వాత శిక్షణా శిబిరంలోకి ప్రవేశించారని పేర్కొంది. ఈ దాడి సమయంలో పోలీసుల శిక్షణా శిబిరంలో 600 మంది ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. 
 
భద్రతా సిబ్బంది 250 మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. కాగా, కొంతమంది పోలీసులు ఉగ్రవాదుల వద్ద బందీలుగా ఉన్నట్టు తెలిసింది. పోలీసుల ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయినట్లు పాక్ మీడియా ప్రకటించింది. నిషిద్ధ అల్‌ఖైదాకు అనుబంధంగా ఉండే లష్కరే, ఇతర ఉగ్రవాదుల పనేనని అధికారులు అనుమానిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోర్తె తీర్చలేదనీ వివాహితపై కత్తితో దాడి చేసిన ఆటో డ్రైవర్... 30 కత్తిపోట్లు..