Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జెలెన్ స్కీకి ప్రధాని మోదీ థ్యాంక్స్.. శాంతియుతంగా పరిష్కరించుకోవాలని..?

జెలెన్ స్కీకి ప్రధాని మోదీ థ్యాంక్స్.. శాంతియుతంగా పరిష్కరించుకోవాలని..?
, సోమవారం, 7 మార్చి 2022 (15:54 IST)
రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య పూర్తిస్థాయి యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. ఈ వార్ సందర్భంగా ఫిబ్రవరి 26న భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తొలిసారిగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్‌ స్కీతోమాట్లాడారు. తాజాగా సోమవారం కూడా మోదీ జెలెన్ స్కీతో మాట్లాడారు.  
 
ఐక్యరాజ్యసమితిలో ఓటింగ్‌కు భారతదేశం గైర్హాజరైన తర్వాత, జెలెన్స్‌కీ ప్రధాని మోదీతో సంభాషించడమే కాక భారతదేశ రాజకీయ మద్దతును కూడా కోరారు. 
 
ఉక్రెయిన్‌ యుద్ధంలో చిక్కుకుపోయిన భారతీయులను తరలించడానికి కేంద్రం ఆపరేషన్ గంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. అంతేగాదు భారతీయ పౌరులను సురక్షితంగా నిష్క్రమించడానికి ఇప్పటికే ఉక్రెయిన్‌ను భారత్‌ సంప్రదించింది కూడా. 
 
ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ జెలెన్ స్కీకి కృతజ్ఞతలు తెలిపారు. రష్యా వల్ల ఉక్రెయిన్‌లో పరిస్థితులపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈరోజు ఆయన యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తో ఫోన్‌లో మాట్లాడారు. 
 
యుక్రెయిన్ లో ఘర్షణ పరిస్థితులు, యుక్రెయిన్ రష్యా మధ్య జరుగుతున్న చర్చల గురించి జెలెన్ స్కీ ప్రధాని మోదీకి వివరించారు. 
 
హింసను తక్షణమే నిలిపివేయాలని పునరుద్ఘాటించిన మోదీ… శాంతియుతంగా చర్చల ద్వారా రెండు దేశాలు సమస్యలు పరిష్కరించుకోవాలని జెలెన్ స్కీకి సూచించారు. 
 
యుక్రెయిన్ నుండి 20 వేల మందికి పైగా భారతీయ పౌరులను తరలించడానికి సహకరించిన ఉక్రెయిన్ అధికారులకు మోదీ ధన్యవాదాలు తెలిపారు. 
 
యుక్రెయిన్‌లో ఇంకా మిగిలి ఉన్న భారతీయ విద్యార్థుల భద్రత రక్షణ పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన మోదీ… ఉక్రెయిన్‌లో మిగిలి ఉన్న భారతీయులను సురక్షితంగా తరలించాలని జెలెన్స్‌కి‌ని కోరారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీ సభాపర్వం : ఈ నెల 25వ తేదీ వరకు బడ్జెట్ సమావేశాలు