Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ముందు గాయత్రి మంత్రం ఆలపించిన పాక్ అమ్మాయి(Video)

గాయత్రి మంత్రం ఎంతటి శక్తివంతమైనదో వేరే చెప్పాల్సిన పనిలేదు. అమ్మవారి మంత్రాన్ని పఠించినంతనే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఈ మంత్రాన్ని హిందువులు పఠిస్తుంటారు. పాకిస్తాన్ దేశంలోనూ గాయత్

Advertiesment
Pakistani Girl
, శుక్రవారం, 17 మార్చి 2017 (17:38 IST)
గాయత్రి మంత్రం ఎంతటి శక్తివంతమైనదో వేరే చెప్పాల్సిన పనిలేదు. అమ్మవారి మంత్రాన్ని పఠించినంతనే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఈ మంత్రాన్ని హిందువులు పఠిస్తుంటారు. పాకిస్తాన్ దేశంలోనూ గాయత్రి మంత్రం సాక్షాత్తూ ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ ముందే ప్రతిధ్వనించింది. 
 
కరాచీలో మార్చి 15న పాకిస్థాన్‌ దేశంలోని మైనారిటీలైన హిందువులు హోలీ సంబరాలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆరోజు ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నవాజ్‌ షరీఫ్‌, ఇంకా ఇతర నాయకులు హాజరయ్యారు. ఆయన అలా ఆశీనులై సంబరాలను చూస్తూ వున్నారు. ఇంతలో నరోదా మాలిని అనే బాలిక గాయత్రి మంత్రాన్ని ఆలపించింది. ఈ మంత్రాన్ని ప్రధాని షరీఫ్ ఆసక్తిగా ఆలకించారు. ఆమె పాట పూర్తయిన తర్వాత చప్పట్లు కొట్టి అభినందించారు. చూడండి ఈ వీడియోను యూ ట్యూబ్ నుంచి...

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం కోసం రూ.5,500 కోట్లు ఖర్చుపెట్టారట.. ఓటు ధర రూ.2వేలు?