Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారత్‌కు పాకిస్థాన్ సంఘీభావం.. కరోనా మంచి పని చేసిందిగా..?!

భారత్‌కు పాకిస్థాన్ సంఘీభావం.. కరోనా మంచి పని చేసిందిగా..?!
, శనివారం, 24 ఏప్రియల్ 2021 (21:42 IST)
కోవిడ్‌పై భారత్ చేస్తున్న పోరాటానికి పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ సంఘీభావం తెలిపారు. కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది.. అన్ని దేశాల్లో కాస్త తగ్గుముఖం పట్టినా.. భారత్‌లో కోవిడ్ విలయమే సృష్టిస్తోంది.. ఈ తరుణంలో మహమ్మారిపై కలిసికట్టుగా పోరాడదాం అంటూ.. భారత్‌కు పిలుపునిచ్చారు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.
 
పొరుగు దేశాలు, ప్రపంచంలో ఈ వ్యాధి బారిన పడినవారంతా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానంటూ సోషల్ మీడియాలో వేదికగా పేర్కొన్నారు ఇమ్రాన్. ఆయన ట్వీట్‌ను పరిశీలిస్తే.. భారత్ కోవిడ్-19 ప్రభంజనంతో యుద్ధం చేస్తోంది.
 
భారత్‌కు సంఘీభావం ప్రకటిస్తున్నాను.. పొరుగు దేశాలు, ప్రపంచంలో ఈ మహమ్మారి బాధితులంతా త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా.. మానవాళి ఎదుర్కొంటున్న ఈ అంతర్జాతీయ సవాల్‌పై మనమంతా కలిసికట్టుగా పోరాడుదాం అంటూ పిలుపునిచ్చారు. ఎప్పుడూ పొరుగు దేశంపై కారాలు మిరియాలు నూరే పాకిస్థాన్ కరోనా విషయంలో మాత్రం సంఘీభావం తెలపడంపై భారత్ హర్షం వ్యక్తం చేస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనాను గుర్తించే ఎయిర్ డాక్టర్.. ఒక మీటర్ దూరంలో వైరస్‌ను..?