Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అణ్వాయుధాలున్నాయ్.. భారత్‌కు బుద్ధి చెప్తాం.. ఉగ్రవాదం పోరు జరుగుతోంది: పాక్ ప్రధాని

భారత సైన్యంపై పదే పదే కాల్పులకు పాల్పడుతున్న దాయాది దేశమైన పాకిస్థాన్.. తాజాగా బహిరంగ హెచ్చరికలు దిగింది. తమ అణ్వాయుధాలు సురక్షితంగా ఉన్నట్లు తెలిపింది. సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిం

అణ్వాయుధాలున్నాయ్.. భారత్‌కు బుద్ధి చెప్తాం.. ఉగ్రవాదం పోరు జరుగుతోంది: పాక్ ప్రధాని
, గురువారం, 21 సెప్టెంబరు 2017 (12:35 IST)
భారత సైన్యంపై పదే పదే కాల్పులకు పాల్పడుతున్న దాయాది దేశమైన పాకిస్థాన్.. తాజాగా బహిరంగ హెచ్చరికలు దిగింది. తమ అణ్వాయుధాలు సురక్షితంగా ఉన్నట్లు తెలిపింది. సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించే పాకిస్థాన్.. ఈసారి బహిరంగంగా హెచ్చరించింది. భారత సైన్యానికి తగిన రీతిలో బుద్ధి చెప్పేందుకు తమ దేశం తక్కువ శ్రేణి అణ్వాయుధాలను అభివృద్ధి చేసినట్లు పాక్‌ ప్రధాని షాహిద్‌ ఖఖాన్‌ అబ్బాసీ చెప్పారు. 
 
అమెరికాలోని కౌన్సిల్‌ ఆన్‌ ఫారిన్‌ రిలేషన్స్‌ ఏర్పాటుచేసిన సమావేశంలో అబ్బాసీ మాట్లాడుతూ.. తమ వద్ద అత్యంత భద్రమైన వ్యవస్థతో కూడిన అణ్వాయుధాలున్నాయని చెప్పారు. సమయం కోసం వేచి చూస్తున్నామని.. తమ వద్ద వున్న అణ్వాయుధాలు సామర్థ్యం తక్కువైనప్పటికీ.. వాటి తాము అభివృద్ధి చేశామన్నారు.
 
అంతేగాకుండా పాకిస్థాన్‌తో యుద్ధం చేసేందుకు ప్రయత్నిస్తున్న భారత్ వ్యూహాలకు గట్టిగా సమాధానం చెప్తామని అబ్బాసీ అన్నారు. తమదేశానికి అణు సామర్థ్యం వుందని.. 1960ల్లోనే అణు వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు అబ్బాసీ అన్నారు. అలాగే పాకిస్థాన్ ఉగ్రవాదులకు స్వర్గధామం కాదన్నారు. పాకిస్థాన్‌ ఓ బాధ్యతాయుతమైన దేశమన్నారు. గత 15ఏళ్లుగా ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు పాకిస్థాన్ అలుపెరగని పోరాటం చేస్తూనే వుందని చెప్పుకొచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డేరాలో విచ్చలవిడిగా వ్యభిచారం.. ఎంతోమందికి గర్భస్రావాలు.. సిట్ అధికారులు