Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నవాజ్ షరీఫ్‌కు ఊరట.. కుల్సుమ్‌ భారీ విజయం..

పాకిస్థాన్ మాజీ ప్ర‌ధాని న‌వాజ్ ష‌రీఫ్‌ను పనామా కేసులో దోషిగా ప్ర‌క‌టిస్తూ జూలై 28న ఇస్లామాబాద్ కోర్టు సంచ‌ల‌న తీర్పు వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. ఆ తీర్పు వల్లే ప్రధాని పదవికి షరీఫ్ రాజీనామా చేయాల్

నవాజ్ షరీఫ్‌కు ఊరట.. కుల్సుమ్‌ భారీ విజయం..
, సోమవారం, 18 సెప్టెంబరు 2017 (10:10 IST)
పాకిస్థాన్ మాజీ ప్ర‌ధాని న‌వాజ్ ష‌రీఫ్‌ను పనామా కేసులో దోషిగా ప్ర‌క‌టిస్తూ జూలై 28న ఇస్లామాబాద్ కోర్టు సంచ‌ల‌న తీర్పు వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. ఆ తీర్పు వల్లే ప్రధాని పదవికి షరీఫ్ రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే ప‌నామా ప‌త్రాల కేసులో తీర్పును మ‌ళ్లీ పరిశీలించాల‌ని ష‌రీఫ్‌తో పాటు ఆయ‌న పిల్ల‌లు రివ్యూ పిటిష‌న్‌ వేశారు. అయితే దాన్ని సుప్రీం కోర్టు తిరస్కరించింది. 
 
ఈ నేపథ్యంలో పాకిస్థాన్ మాజీ ప్ర‌ధాని న‌వాజ్ ష‌రీఫ్‌కు పెద్ద ఊర‌ట ల‌భించింది. షరీఫ్ రాజీనామాతో ఖాళీ అయిన స్థానంలో నవాజ్ షరీఫ్ సతీమణి కుల్సుమ్ నవాజ్ ఘన విజయం సాధించారు. ఎన్ఏ-120 నియోజ‌క‌వ‌ర్గానికి ఆదివారం ఎన్నిక‌లు నిర్వ‌హించ‌గా అర్థరాత్రి దాటిన త‌ర్వాత ఫ‌లితాలు వెల్ల‌డ‌య్యాయి. ఈ ఎన్నికల్లో సొంత పార్టీ పీఎంఎల్‌-ఎన్ త‌ర‌పున పోటీ చేసిన కుల్సుమ్ 14,888 ఓట్ల‌తో గెలుపొందారు. 
 
మాజీ క్రికెట‌ర్ ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్థాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ (పీటీఐ), బిలావల్ భుట్టో జ‌ర్దారీ పార్టీ అభ్య‌ర్థులు కూడా బ‌రిలో నిలిచి కుల్సుమ్‌కు గ‌ట్టి పోటీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో మొత్తం 3.20 లక్షల ఓట్లు పోల్ అయ్యాయి.
 
కుల్సుమ్ 59,413 ఓట్లు సాధించి సమీప పీటీఐ అభ్యర్థి యాస్మిన్ రషీద్‌పై జయకేతనం ఎగురవేశారు. ఈ ఎన్నిక‌ల్లో పాకిస్థాన్ చ‌రిత్ర‌లో తొలిసారి బ‌యోమెట్రిక్ విధానాన్ని ఉప‌యోగించారు. ఈ ఎన్నికల్లో కుల్సుమ్ విజయం సాధించడంపై నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం నవాజ్ మాట్లాడుతూ.. దీన్ని ప్రజా తీర్పుగా అభివర్ణించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రెండు కళ్ల సిద్ధాంతం ఎవరిది?... తెలంగాణ స్టాఫ్ నర్స్ పరీక్షలో వింత ప్రశ్నలు