Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆ దేశంలో ప్రతి రోజూ 11 మంది మైనర్లపై అత్యాచారాలు...

పాకిస్థాన్ కేవలం ఉగ్రదేశంగానే కాదు... అత్యాచారాల కేంద్రంగా కూడా ముద్రపడింది. ఆ దేశంలో ప్రతి రోజూ సగటున 11 మంది బాలికలపై అత్యాచారాలు జరుగుతున్నట్టు ఓ అంతర్జాతీయ సంస్థ నిర్వహించిన తాజా సర్వేలో వెల్లడైంద

ఆ దేశంలో ప్రతి రోజూ 11 మంది మైనర్లపై అత్యాచారాలు...
, గురువారం, 23 మార్చి 2017 (11:31 IST)
పాకిస్థాన్ కేవలం ఉగ్రదేశంగానే కాదు... అత్యాచారాల కేంద్రంగా కూడా ముద్రపడింది. ఆ దేశంలో ప్రతి రోజూ సగటున 11 మంది బాలికలపై అత్యాచారాలు జరుగుతున్నట్టు ఓ అంతర్జాతీయ సంస్థ నిర్వహించిన తాజా సర్వేలో వెల్లడైంది. ముఖ్యంగా గత యేడాదితో పోల్చితే పాక్‌లో బాల, బాలికలపై అత్యాచారాల కేసుల సంఖ్య పదిశాతం పెరినట్టు తెలుస్తోంది. 
 
2015వ సంవత్సరంలో బాలలపై అత్యాచారాల కేసులు 3,768 నమోదుకాగా, 2016లో ఈ కేసుల సంఖ్య 4,139 కి చేరుకుందని బాలలపై అత్యాచారాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న సాహిల్ అనే అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ తన నివేదికలో వెల్లడించింది. గత ఏడాది 2,410 మంది అమ్మాయిలు, 1,729 మంది బాలురు లైంగికంగా వేధింపులకు గురయ్యారని తేలింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమ్మా అన్నాడీఎంకే పేరిట ఓపీఎస్ కొత్త పార్టీ-ఎన్నికల గుర్తుగా.. రెండాకుల్ని పోలిన విద్యుత్ స్తంభం