Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పాక్ మహిళకు అమెరికా అవార్డు.. సాహస స్త్రీగా ఎంపిక..!

Advertiesment
పాక్ మహిళకు అమెరికా అవార్డు.. సాహస స్త్రీగా ఎంపిక..!
, శుక్రవారం, 6 మార్చి 2015 (09:43 IST)
పాకిస్థాన్ దేశ మహిళలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పెరుగుతోంది. గత ఏడాది అక్షర సాహసి యూసఫ్ జాయ్ మలాలాకు అత్యున్నత నోబెల్ అవార్డు దక్కిన విషయం తెలిసిందే. తాజాగా ఆ దేశానికి చెందిన మరో మహిళకు  అమెరికా అవార్డు దక్కింది. 
 
పాక్‌లో ఓ ఎన్జీవో సంస్థను స్థాపించి తమ దేశంతోపాటు అంతర్జాతీయంగా మహిళల హక్కుల కోసం నిత్యం పోరాడుతున్న టాబాస్సమ్ అద్నాన్ అనే పాక్ మహిళను అమెరికా గుర్తించింది. దీంతో ఆమెను 2015కుగానూ అంతర్జాతీయ మహిళా సాహస అవార్డుకు ఎంపిక చేసింది.
 
అద్నాన్ బాల్యం వివాహ బాధితురాలు. ఆమెకు 13 ఏళ్ల వయసులోనే పెళ్లి జరిగింది. అనంతరం అత్తగారింట్లో నరకయాతన అనుభవించడంతో ధైర్యంగా తన 20 ఏట భర్తకు విడాకులిచ్చి అనంతరం ఓ ఎన్జీవో సంస్థను స్థాపించి పరువు హత్యలు, బాలికల విద్య, వరకట్నం వేధింపులు వంటి పలు సామాజిక సమస్యలపై ఆమె పోరాటం చేస్తూవస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu