Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారత్‌లో హై-ప్రొఫైల్ టెర్రరిస్టు దాడులు జరిగే ప్రమాదం ఉంది: హెచ్చరించిన ఇంటలిజెన్స్

పాకిస్థాన్ కేంద్రం పనిచేసే ఉగ్రవాద సంస్థలతో పొరుగు దేశాలైన భారత్, ఆప్ఘనిస్థాన్‌లతో పాటు అమెరికాకు కూడా ప్రమాదం పొంచివుందని అమెరికాకు చెందిన ఇంటెలిజెన్స్ సంస్థ హెచ్చరించింది. ఈ మేరకు భారత సరిహద్దుల్లో

భారత్‌లో హై-ప్రొఫైల్ టెర్రరిస్టు దాడులు జరిగే ప్రమాదం ఉంది: హెచ్చరించిన ఇంటలిజెన్స్
, శుక్రవారం, 12 మే 2017 (11:45 IST)
పాకిస్థాన్ కేంద్రం పనిచేసే ఉగ్రవాద సంస్థలతో పొరుగు దేశాలైన భారత్, ఆప్ఘనిస్థాన్‌లతో పాటు అమెరికాకు కూడా ప్రమాదం పొంచివుందని అమెరికాకు చెందిన ఇంటెలిజెన్స్ సంస్థ హెచ్చరించింది. ఈ మేరకు భారత సరిహద్దుల్లో ఉగ్రవాదులు పొంచివున్నారని.. వీరు భారత్‌లోకి చొరబడితే మరిన్ని ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని యూఎస్ ఇంటెలిజెన్స్ డైరక్టర్ డానియల్ కోట్స్ హెచ్చరించారు. 
 
ఇదే ఏడాది భారత్-పాకిస్థాన్ మధ్య సంబంధాలు మరింత జఠిలం కానున్నాయని.. ఇంకా హై-ప్రొఫైల్ టెర్రరిస్టు దాడులు జరిగే ప్రమాదం కూడా ఉందని తద్వారా భారత్ అప్రమత్తంగా ఉండాలని అమెరికా నిఘా సంస్థ హెచ్చరించింది. 
 
గత ఏడాది జరిగిన పఠాన్ కోట్, యూరీ ఘటనలను గుర్తు చేసిన కోట్స్.. ఈ ఘటనలకు పాల్పడింది.. సరిహద్దులు దాటి వచ్చిన ఉగ్రవాదులేనని గుర్తు చేశారు. ఇలాంటి ఘటనల వల్ల భారత్-పాకిస్థాన్‌ల మధ్య సంబంధాలు మరింత దెబ్బతిన్నాయన్నారు. తమ దేశంలోని ఉగ్ర మూలాలను ఏరిపారేయడంలో పాకిస్థాన్ తీవ్రంగా విఫలమవుతోందని.. తద్వారా ఎప్పటికైనా ప్రమాదమేనని అమెరికా ఇంటిలిజెన్స్ అధికారులు హెచ్చరిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత్‌లో విధ్వంసానికి పాక్ ఉగ్రసంస్థల కుట్ర : అమెరికా హెచ్చరిక