Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమెరికా నగరాలతో నిత్యానంద కైలాస దేశం ఒప్పందాలు

nityananda
, శనివారం, 18 మార్చి 2023 (10:19 IST)
వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్వామి స్థాపించిన కైలాస దేశం అమెరికాలోని పలు నగరాలతో సాంస్కృతిక భాగస్వామ్యం ఒప్పందాలను కుదుర్చుకుందట. 'కైలాసతో 'సోదరి-నగరం' ఒడంబడికను చేసుకున్నట్లు న్యూజెర్సీలోని నెవార్క్‌ నగరం ఇటీవలే ప్రకటించింది. ఈ ఏడాది జనవరి 12న జరిగిన ఈ సంతకాల కార్యక్రమానికి నగరంలోని సిటీ హాల్‌ వేదికగా నిలిచింది. 
 
మరోవైపు, రిచ్‌మండ్‌, వర్జీనియా, డేటన్‌, ఒహాయో, బ్యూనా పార్క్‌, ఫ్లోరిడా వంటి 30 నగరాలతో సాంస్కృతిక భాగస్వామ్యాలను కుదుర్చుకున్నట్లు కైలాస దేశం వెబ్‌సైట్‌లో తెలిపింది. ఉనికిలో లేనిదిగా భావిస్తున్న నకిలీ దేశంతో ఇటువంటి ఒప్పందాలు కుదిరిన తీరును ఫాక్స్‌ న్యూస్‌ గురువారం ఓ కథనంలో విమర్శించింది. 
 
ఆ నకిలీ గురువు బోల్తాకొట్టించిన నగరాల జాబితా సుదీర్ఘంగా ఉందని ఆక్షేపించింది. పలు నగరాలు ఆయా ఒప్పందాల ప్రకటన నిజమేనని వెల్లడించాయంది. భారత్‌లో అత్యాచారం సహా పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద దేశం నుంచి పారిపోయి ఈక్వెడార్‌ సమీపంలో ఓ దీవిని కొనుగోలు చేసి దాన్ని కైలాస దేశంగా ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ దేశం తరపున కొందరు ప్రతినిధులు ఐక్యరాజ్య సమితిలో హాజరై తమ దేశ గురించి వివరించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గతుకుల రోడ్డు - ఆటో బోల్తా బడి ఆరుగురు మృతి