Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నైజీరియాలో చర్చ్ కూలిన ఘటనలో 160 మంది మృతి.. ఐరన్ రాడ్ల కింద వందలాది మంది?

నైజీరియాలోని ''ది రెయినర్స్ బైబిల్ చర్చ్'' కుప్పకూలిన ఘటనలో 160మంది మృతి చెందారు. బిషప్ నియామక కార్యక్రమం జరుగుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఈ కార్యక్రమంలో అక్వా ఇబోమ్ గవర్నర్ ఉడోమ్ ఎమ్మాన్యుయేల్ కూడా పా

నైజీరియాలో చర్చ్ కూలిన ఘటనలో 160 మంది మృతి.. ఐరన్ రాడ్ల కింద వందలాది మంది?
, ఆదివారం, 11 డిశెంబరు 2016 (16:16 IST)
నైజీరియాలోని ''ది రెయినర్స్ బైబిల్ చర్చ్'' కుప్పకూలిన ఘటనలో 160మంది మృతి చెందారు. బిషప్ నియామక కార్యక్రమం జరుగుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఈ కార్యక్రమంలో అక్వా ఇబోమ్ గవర్నర్ ఉడోమ్ ఎమ్మాన్యుయేల్ కూడా పాల్గొన్నారు. ఐరన్ రాడ్లు, సిమెంటు, రాళ్ళ క్రింద వందలాది మంది చిక్కుకుపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. 
 
మరోవైపు కెన్యాలోని పెద్ద ప్రమాదం సంభవించింది. ఓ ఆయిల్‌ ట్యాంకర్‌ పేలి పోయింది. ఈ ప్రమాదంలో 33మంది అక్కడికక్కడే మృతిచెందారు. పలువురు గాయాలపాలయ్యారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని విపత్తు నిర్వహణ శాఖ అధికారులు తెలిపారు. ఈ ఘటన నాకురు-నైరోబీ రోడ్డులో రాత్రి 9.30గంటలకు సంభవించినట్లు తెలిపారు.
 
వేగంగా వెళుతున్న ట్యాంకర్‌పై నియంత్రణ కోల్పోవడంతో కెరాయ్‌ ప్రాంతంలోని ఇతర వాహనాలపైకి దూసుకెళ్లిందని, ఈ ఘటనలో పేలుడు సంభవించి అనూహ్యంగా పలువురు మృత్యువాత పడినట్లు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

''క్రైం పెట్రోల్'' యాక్టర్ రాహుల్ చేలానీ అడ్డంగా బుక్కయ్యాడు.. రూ.43 లక్షలు స్వాధీనం..