Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పాకిస్థాన్ ప్రజలంతా నిజాయితీపరులా? నవాజ్ షరీఫ్ ప్రశ్న

తన దేశ ప్రజలను కించపరిచేలా పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇపుడు పాక్‌లో చర్చనీయాంశంగా మారాయి. పాకిస్థాన్ ప్రజలంతా నిజాయితీపరులా అంటూ షరీఫ్ ప్రశ్నించడం ఇపు

పాకిస్థాన్ ప్రజలంతా నిజాయితీపరులా? నవాజ్ షరీఫ్ ప్రశ్న
, సోమవారం, 31 జులై 2017 (09:13 IST)
తన దేశ ప్రజలను కించపరిచేలా పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇపుడు పాక్‌లో చర్చనీయాంశంగా మారాయి. పాకిస్థాన్ ప్రజలంతా నిజాయితీపరులా అంటూ షరీఫ్ ప్రశ్నించడం ఇపుడు వివాదాస్పదంగా మారింది. 
 
పనామా గేట్ కుంభకోణంలో నవాజ్ షరీఫ్‌తో పాటు.. ఆయన కుటుంబ సభ్యులంతా చిక్కుకున్న విషయం తెల్సిందే. ఈ కేసులో పాక్ సుప్రీంకోర్టు షరీఫ్ కుటుంబ సభ్యులందరినీ నిందితులుగా ప్రకటించింది. ప్రధాని పదవికి షరీఫ్‌ను అనర్హుడిగా ప్రకటించింది. దీంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు.
 
తాజాగా తనపై వచ్చిన ఆరోపణలపై షరీఫ్ మాట్లాడుతూ.. అందరూ తన కుటుంబాన్నే లక్ష్యంగా చేసుకున్నారని, ఆమాట కొస్తే పాకిస్థానీయులందరూ నిజాయతీపరులా? అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్‌లో ఉన్నవారందరూ నిజాయతీగా జీవిస్తున్నారా? అని ప్రశ్నించి కలకలం రేపారు. ఇక్కడ డబ్బు తీసుకున్నా సమస్యే, తీసుకోకున్నా సమస్యేనని ఆవేదన వ్యక్తం చేశారు. తాను తప్పు చేసివుంటే నిర్భయంగా ఒప్పుకుంటానని తేల్చి చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తప్పు చేసింది మీరు.. మీకు క్షమాపణలు చెప్పాలా.. నెవర్ అంటున్న డీఐజీ రూప