Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్రీనివాస్‌ అంత్యక్రియలు పూర్తి.. కళ్లముందు భర్త విగతజీవిగా పడివుండటాన్ని..?

అమెరికాలో కాల్పుల ద్వారా హత్యకు గురైన శ్రీనివాస్ కూచిభొట్ల అంత్యక్రియలు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో జరిగాయి. సోమవారం రాత్రి శ్రీనివాస్ మృతదేహంతో పాటు అమెరికా నుంచి ఆయన భార్య సునయన, శ్రీనివాస్ సోదరుడు

శ్రీనివాస్‌ అంత్యక్రియలు పూర్తి.. కళ్లముందు భర్త విగతజీవిగా పడివుండటాన్ని..?
, మంగళవారం, 28 ఫిబ్రవరి 2017 (17:30 IST)
అమెరికాలో కాల్పుల ద్వారా హత్యకు గురైన శ్రీనివాస్ కూచిభొట్ల అంత్యక్రియలు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో జరిగాయి. సోమవారం రాత్రి శ్రీనివాస్ మృతదేహంతో పాటు అమెరికా నుంచి ఆయన భార్య సునయన, శ్రీనివాస్ సోదరుడు ఆయన సతీమణి, స్నేహితులు కూడా వచ్చారు. హైదరాబాద్ చేరుకున్న శ్రీనివాస్ మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు, బంధువులు రోదించారు. పలువురు నేతలు, సన్నిహితులు శ్రీనివాస్ పార్థివదేహానికి నివాళులర్పించారు.
 
భౌతికకాయాన్ని ఇంటికి తీసుకువచ్చేందుకు ఎంపీ మల్లారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, పలువురు నేతలు శ్రీనివాస్ కుటుంబం వెంటే ఉన్నారు. కష్టసుఖాల్లో వెన్నంటే ఉండాల్సిన భర్త కళ్లముందు విగతజీవిగా పడిఉండడాన్ని సునయన జీర్ణించుకోలేకపోతున్నారు. ఆమెను, శ్రీనివాస్ తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరీ తరం కాలేదు. శ్రీనివాస్ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. 
 
బౌరంపేటలో శ్రీనివాస్ నివాసం నుంచి ఆయన మృత దేహాన్ని ప్రత్యేక వాహనంలో ఉంచి అంతిమ యాత్ర నిర్వహించారు. అనంతరం జూబ్లీహిల్స్ మహాప్రస్థానానికి తరలించి..అంత్యక్రియలు నిర్వహించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మార్చి 1 నుంచి జియో ప్రైమ్ మెంబర్‌షిప్ ప్లాన్.. సర్‌ప్రైజింగ్ ఆఫర్లివే...