Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సముద్రపు తాబేలుపై ఎక్కి నిల్చుని తైతక్కలాడారు.. ఇడియట్స్ అంటూ సోషల్ మీడియాలో విమర్శలు

సెల్ఫీ పిచ్చితో మూగజీవులకు కష్టాలు తెచ్చిపెడుతున్నారు... సోషల్ మీడియా ప్రేమికులు. తాజాగా ఆస్ట్రేలియా క్వీన్స్‌లాండ్‌కు చెందిన రికీ రోజర్స్ అనే వ్యక్తి తన ఫేస్ బుక్‌లో వివాదాస్పద ఫోటో పెట్టి కష్టాలను క

సముద్రపు తాబేలుపై ఎక్కి నిల్చుని తైతక్కలాడారు.. ఇడియట్స్ అంటూ సోషల్ మీడియాలో విమర్శలు
, బుధవారం, 2 నవంబరు 2016 (17:50 IST)
సెల్ఫీ పిచ్చితో మూగజీవులకు కష్టాలు తెచ్చిపెడుతున్నారు... సోషల్ మీడియా ప్రేమికులు. తాజాగా ఆస్ట్రేలియా క్వీన్స్‌లాండ్‌కు చెందిన రికీ రోజర్స్ అనే వ్యక్తి తన ఫేస్ బుక్‌లో వివాదాస్పద ఫోటో పెట్టి కష్టాలను కొనితెచ్చుకున్నాడు. రోజర్స్ అనే వ్యక్తి వేరో వ్యక్తితో కలిసి.. సముద్రపు తాబేలుపై ఎక్కి నిల్చుని తైతక్కలాడారు. అంతటితో ఆగకుండా ఈ ఫోటోను ఫేస్ బుక్‌లో పెట్టేశారు. ఈ చర్యపై నెటిజన్లతో పాటు జంతు ప్రేమికులు కూడా ఫైర్ అవుతున్నారు. 
 
ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌లో ఈ ఫోటోను తీసినట్లు రికీ రోజర్స్ తెలిపాడు. అతని పోస్టుపై సోషల్‌ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. బుర్రలేని ఈ మూర్ఖులకు తగిన బుద్ధి చెప్పాల్సిందేనని నెటిజన్లు కోపంతో ఊగిపోతున్నారు. ఇంకా వీరిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇకపోతే ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఇద్దరు ఇడియట్ల చర్య వల్ల ఆ తాబేలు చనిపోయి ఉంటుందని క్వీన్స్‌లాండ్‌ పార్క్స్ వైల్డ్‌లైఫ్‌ సర్వీస్‌ తెలిపింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప‌వ‌న్ క‌ల్యాణ్ ఏలూరు ఇల్లు ఇదే... చూద్దాం రండి...