నట్ ఎలర్జీ ఉన్న వ్యక్తి ఓ రెస్టారెంట్ నుంచి కూర పార్శిల్ తెచ్చుకుని తిని మృత్యవాత పడిన దుస్సంఘటన ఇంగ్లండ్లోని నార్త్యార్క్షైర్లో జరిగింది. పూర్తి వివరాలను పరిశీలిస్తే నార్త్ యార్క్షైర్లో మహమ్మద్ జమాన్ అనే వ్యక్తి ఇండియన్ గార్డెన్ అనే రెస్టారెంట్ నడుపుతున్నాడు. ఒక రోజు నట్ ఎలర్జీ ఉన్న పాల్ విల్సన్ అనే వ్యక్తి వేరుశెనగలు, జీడిపప్పు, బాదం కలగలిపిన కూరను రెస్టారెంట్ నుంచి పార్సిల్ తీసుకుని వెళ్లాడు.
అయితే ఆ కూరలో పల్లీలు, బాదం పొడి కలిపి వండటంతో ఆ కూర తిన్న పాల్ విల్సన్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన 2014 జనవరిలో జరిగింది. దీంతో రెస్టారెంట్ యజమాని మహమ్మద్ జమాన్పై హత్య, వినియోగదారుల ఆరోగ్యం పట్ల తీవ్ర నిర్లక్ష్యం తదితర అభియోగాల కింద కేసు నమోదు చేశారు. 2016 మే 9న అతడిపై విచారణ ప్రారంభమైంది. విల్సన్ తీసుకున్న కూరలో పల్లీలు ఉన్నాయని.. వాటి వల్లే ఆయన ఎలర్జీతో చనిపోయినట్లు విచారణలో రుజువైంది.
విల్సన్ రెస్టారెంట్లో తనకు నట్స్లేని పదార్థాలు కావాలని అడిగిమరీ పార్శిల్ కొనుక్కున్నాడట. కాని యాజమాని అతని మాటలేవి పట్టించుకోకుండా నిర్లక్ష్యంతో పల్లీలతో చేసిన కూర పార్సిల్ ఇచ్చారని జమాన్పై పోలీసులు కేసు నమోదుచేశారు. రెస్టారెంట్లో సరైన నిబంధనలు పాటించడంలేదని.. నిర్లక్ష్యంగా వ్యవహరించారని అభియోగాలు నమోదు చేసి జమాన్పై విచారణ జరుపుతున్నారు. యజమాని జమాన్ మాత్రం తనపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నారు. మరి ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాల్సిందే.