Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమెరికాలో దారుణం: కారులో మంటలు.. సజీవదహనమైన భారత సంతతి మహిళ

అమెరికాలో భారత సంతతి యువతి మంటల్లో దుర్మరణం పాలైంది. కారు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కారు మంటల్లో యువతి ప్రాణాల కోసం ఆర్తనాదాలు పెడుతున్నా.. అందరూ చూస్తుండిపోయారే కానీ.. ఆ

Advertiesment
Man
, మంగళవారం, 17 అక్టోబరు 2017 (09:12 IST)
అమెరికాలో భారత సంతతి యువతి మంటల్లో దుర్మరణం పాలైంది. కారు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కారు మంటల్లో యువతి ప్రాణాల కోసం ఆర్తనాదాలు పెడుతున్నా.. అందరూ చూస్తుండిపోయారే కానీ.. ఆ యువతిని రక్షించే ప్రయత్నం మాత్రం చేయలేదు.

వివరాల్లోకి వెళితే.. సయీద్‌ అహ్మద్‌ (23) అనే వ్యక్తి హర్లీన్‌ గ్రెవాల్‌ అనే భారతీయ సంతతికి చెందిన 25ఏళ్ల యువతిని కారులో ఎక్కించుకున్నాడు. ఆమె ప్యాసింజర్‌ సీట్లో కూర్చొని ఉంది. అప్పటికే కొంచెం మద్యం సేవించిన అతడు బ్రూక్లిన్‌-క్వీన్‌ ఎక్స్‌ప్రెస్‌ వేలో ఓ కాంక్రీట్‌ పిల్లర్‌కు ఢీకొట్టాడు. దీంతో కారులో మంటలు చెలరేగాయి. 
 
అయితే, కారు దిగిన సయీద్‌ వెనుకాలే ఉన్న ప్యాసింజర్‌ అయిన హర్లీన్‌ను పట్టించుకోకుండానే మరో కారులో ఆస్పత్రి వెళ్లిపోయాడు. దీంతో ఆర్తనాదాలు చేస్తూ నడిరోడ్డులో నిస్సహాయ స్థితిలో ఆమె సజీవ దహనమైంది.

అయితే కారు డ్రైవర్ సయీద్ సోదరుడు మాత్రం యువతిని కాపాడేందుకు ప్రయత్నించాడని.. కానీ కారు డోర్ ఇరుక్కుపోయి మహిళ కారు నుంచి బయటకు రాలేకపోయిందన్నారు. అందుకే సయీద్ చేతులు కూడా కాలిపోయాయని చెప్పుకొచ్చాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జీఎస్టీ ఉమ్మడి నిర్ణయం : ప్రధాని నరేంద్ర మోడీ